
Indian Air Force: రంగంలోకి దిగిన భారత వాయుసేన.. పెషావర్పై బాంబుల వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ జరిపిన డ్రోన్, మిస్సైల్ దాడులకు భారతదేశం కఠినంగా ప్రతిస్పందించింది.
ప్రత్యర్థి చర్యగా భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్ఫోర్స్) నేరుగా రంగంలోకి దిగింది.
ఈ దాడుల్లో పాకిస్థాన్లోని కీలక నగరాలు లక్ష్యంగా మారాయి. ముఖ్యంగా పెషావర్, లాహోర్ నగరాలపై బాంబులు విసురుతూ విరుచుకుపడింది.
ఇక ఇదే సమయంలో భారత సరిహద్దుల్లోని యూరీ ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం విచక్షణ లేకుండా కాల్పులకు పాల్పడుతోంది.
ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనై తమ ప్రాణాలను రక్షించుకునేందుకు బంకర్లలోకి పరుగులు పెట్టారు.
వివరాలు
పాకిస్థాన్పై బలూచిస్థాన్ సాయుధ విప్లవకారులు దాడి
మరోవైపు, పాకిస్థాన్పై బలూచిస్థాన్ సాయుధ విప్లవకారులు కూడా దాడికి దిగారు.
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) క్వెట్టా నగరాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపింది.
అంతేకాకుండా, పాకిస్థాన్ ఫ్రాంటియర్ కోర్పై కూడా తీవ్రమైన దాడి చేశారు.
ఒకవైపు భారత దాడులు, మరోవైపు బలూచ్ విప్లవకారుల చర్యలు పాకిస్థాన్ను గట్టిగా కొట్టేసాయి.
ఈ క్రమంలో పాకిస్థాన్ దేశం తీవ్రంగా దెబ్బతిని రక్త కన్నీరు పెడుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పెషావర్పై బాంబుల వర్షం
Indian Army, Indian Air Force and Indian Navy has successfully attacked Peshawar, Rawalpindi, Punjab, Karachi and Islamabad 🇮🇳🔥
— Ishaan Mahajan (@imIshaanMahajan) May 8, 2025
Jai Hind 🇮🇳#IndiaPakistanWar #JaiHind #IndianArmy #OperationSindhoor #India pic.twitter.com/otpnrGUZZi