NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చైనా,పాకిస్థాన్‌లతో వ్యాపారంపై భారత్ ఆంక్షలు.. తమకు తెలియకుండా ఎలాంటి వాణిజ్యం చేయకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు 
    తదుపరి వార్తా కథనం
    చైనా,పాకిస్థాన్‌లతో వ్యాపారంపై భారత్ ఆంక్షలు.. తమకు తెలియకుండా ఎలాంటి వాణిజ్యం చేయకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు 
    నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం

    చైనా,పాకిస్థాన్‌లతో వ్యాపారంపై భారత్ ఆంక్షలు.. తమకు తెలియకుండా ఎలాంటి వాణిజ్యం చేయకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 12, 2023
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ లతో వ్యాపార సంబంధాలపై నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

    నిర్దిష్ట దేశాల పేరు పెట్టకుండానే, జూలై 23, 2020న భారతదేశంతో భూ సరిహద్దులను పంచుకునే దేశాల్లోని కంపెనీల నుంచి పబ్లిక్ ప్రాజెక్ట్‌ల కొనుగోళ్లను పరిమితం చేసింది.

    మరోవైపు చైనా, పాకిస్థాన్‌ లాంటి శత్రు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న దేశీయ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలు ప్రత్యక్షంగా భాగస్వామ్యాన్ని కేంద్రం నియంత్రిస్తోంది. ఫలితంగా కేంద్రం ఆర్థిక భద్రతా నిబంధనలను కఠినతరం చేసింది.

    అంతేకాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

    DETAILS

    వ్యూహాత్మక రంగాల్లో చైనా భాగస్వామ్యంపై నియంత్రణ

    భారత ప్రభుత్వానికి తెలియకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా శత్రు దేశాలతో గానీ భారత్ తో సరిహద్దును పంచుకునే దేశాలతో కానీ వాణిజ్య సంబంధాలు నెరిపినా అవి కేంద్రం పరిధిలోకి లోబడే ఉంటాయని స్పష్టం చేసింది.

    భద్రతా సమస్యల్లో పెరుగుదల కనిపిస్తున్న కారణంగా శత్రుదేశాలు,పొరుగు దేశాలతో వ్యాపార సంబంధాలను కలిగి ఉండాలంటే ముందస్తుగా కేంద్రం ఆమోదం పొందాలని ఆదేశించింది.

    మౌలిక సదుపాయల ప్రాజెక్ట్‌ల్లో చైనా కాంట్రాక్టర్లను భాగం చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రైవేట్ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది.

    అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లోని ఉగ్రదాడికి ముందు భద్రతాపరమైన పరిణామాలపై కేంద్రానికి విశ్వాసనీయమైన సమాచారం అందింది.

    విద్యుత్, పెట్రోలియం,బొగ్గు, టెలికాం లాంటి వ్యూహాత్మక రంగాల్లో చైనా భాగస్వామ్యాన్ని తాజా ఆదేశం నియంత్రిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    భారతదేశం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కేంద్ర ప్రభుత్వం

    ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునే ప్యానెల్ నుండి ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు  భారతదేశం
    No confidence Motion:లోక్ సభలో వీగిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభ
    రసాభసాగా పార్లమెంట్.. నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అమిత్ షా

    భారతదేశం

    కెనడా హై కమిషన్ కీలక ప్రకటన..'భారత్'లో సేవలు కొనసాగిస్తామని, భద్రతా కల్పించాలని అభ్యర్థన కెనడా
    నిజ్జర్ హత్యపై కెనడాకు భారత్ కౌంటర్.. ఆధారాలుంటే బయటపెట్టాలని హితవు   కెనడా
    ఎమర్జెన్సీ అలెర్ట్‌ : మీ ఫోన్‌కు వచ్చిందా చూసుకోండి.. భయపడొద్దు, కారణమిదే భారతదేశం
    'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025