Page Loader
పేలుళ్ల కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు 
పేలుళ్ల కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు

పేలుళ్ల కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2023
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు శిక్ష పడింది. ఈ మేరకు దిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. హైదరాబాద్, డిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ఈ నిందితులు రెక్కీ నిర్వహించారని జాతీయ దర్యాప్తు సంస్థ చేసిన వాదనలతో సదరు కోర్టు ఏకీభవించింది. ముఖ్యంగా పేలుళ్ల కోసం నిందితులు ఆయుధాలను సైతం సమకూర్చుకున్నారని దర్యాప్తు సంస్థ స్ఫష్టం చేసింది. హైదరాబాద్ కు చెందిన ఒబేద్ రహమాన్, బీహార్‌కు చెందిన ధనిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్ లను 2013లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. వారిని జులై 7వ తేదీని దోషులుగా నిర్ధారించిన ఎన్ఐఎ కోర్టు నేడు శిక్ష విధించింది.

Details

జైలు శిక్షతో పాటు జరిమానా విధింపు

2007లో జరిగిన గోకుల్ చాట్, లుంబినీపార్కు జంటపేలుళ్లు, 2013లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లలో వీరి పాత్ర ఉందని ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. అంతే కాకుండా గతంలో వారణాసి, ముంబై, ఫజియాబాద్, డిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరులో జరిగిన పేలుళ్లలోనూ ఈ నలుగురి పాత్ర ఉందని పేర్కొంది. ఈ కేసులలో 11 మందిని నిందితులను జాతీయదర్యాప్తు సంస్థ చేర్చింది. మిగతా ఏడుగురు నిందితుల్లో యాసిన్ బత్కల్, అక్తర్, రెహమాన్, తెహసిన్అక్తర్, హైదర్అలీ, రియాజ్ బత్కల్‌తో పాటు మరో నిందితుడు ఉన్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఐదుగురు నిందితులపై విచారణ కొనసాగుతోంది. ఆ నలుగురికి జైలు శిక్షతో పాటు డానిష్ అన్సారీకి రూ. 2,000, అఫ్తాబ్ ఆలమ్‌కు రూ. 10,000 జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు.