NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indian Railways- highest Record-Trips: ఏప్రిల్‌లో అత్యధిక ప్రయాణీకుల సంఖ్యను నమోదు చేసిన భారతీయ రైల్వే
    తదుపరి వార్తా కథనం
    Indian Railways- highest Record-Trips: ఏప్రిల్‌లో అత్యధిక ప్రయాణీకుల సంఖ్యను నమోదు చేసిన భారతీయ రైల్వే

    Indian Railways- highest Record-Trips: ఏప్రిల్‌లో అత్యధిక ప్రయాణీకుల సంఖ్యను నమోదు చేసిన భారతీయ రైల్వే

    వ్రాసిన వారు Stalin
    Apr 23, 2024
    04:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ రైల్వే (Inian Railway) ఏప్రిల్ నెలలో అత్యధిక ప్రయాణికుల సంఖ్య (Highest Record)ను నమోదు చేసింది.

    రికార్డు స్థాయిలో 411 మిలియన్ల మంది గడిచిన మూడు వారాలలో రైలు (Trains)లో ప్రయాణించినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.

    వేసవి సెలవులు (Summer Holidays), వివాహాలు (Wedding),ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికలు (Elections) నేపథ్యంలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు రైలు ద్వారా ప్రయాణించినట్లు తాజా ప్రకటనలో పేర్కొంది.

    ఏప్రిల్ తొలి మూడు వారాలలో ఇంత రికార్డు స్థాయిలో రైల్వేలో ప్రయాణించడం ఇదే తొలిసారి.

    ప్రయాణికుల (Passengers) రద్దీ దృష్ట్యా పశ్చిమ రైల్వే (Westren Railway) అత్యధికంగా 1,878 ట్రిప్పులను నడిపింది.

    Railway-Record-Trips

    రికార్డు స్థాయిలో అదనపు ట్రిప్పులు

    తర్వాత నార్త్ వెస్ట్రన్ (North Westren Railway) రైల్వే 1,623 ట్రిప్పులను, దక్షిణ మధ్య రైల్వే (South central Railway) 1,012 ట్రిప్పులను, తూర్పు మధ్య రైల్వే (East central Railway) 1,003 ట్రిప్పులను నడిపాయి.

    సుమారు 370 మిలియన్ ప్యాసింజర్లను ఈ రైళ్లు వారి గమ్యస్థానాలకు చేర్చాయి.

    గత ఏడాది ఇదే సమయంలో 350 మిలియన్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశాయి.

    కోవిడ్ అనంతర పరిణామాల తర్వాత ఇంత భారీ స్థాయిలో ప్రయాణికులు రైలులో ప్రయాణించడం ఇదే తొలిసారి.

    ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు భారతీయ రైల్వే సుమారు 411.6 మిలియన్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసింది.

    Indian Railway-Record

    కిక్కిరిసిపోయిన రైళ్లు

    ఏప్రిల్ 20, 21 రెండు రోజుల లోనే 33.8 మిలియన్ల మంది రైళ్లలో ప్రయాణించారు.

    రద్దీ పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లన్నీ కిక్కిరిసిపోయాయి.

    ఢిల్లీ, పాట్నా,కోల్ కతా, దర్భంగా రైల్వే రూట్ లన్నీ బిజీగా మారిపోయాయి.

    రైళ్లన్నీ కిటకిటలాడిపోయాయి.

    కొన్ని రైళ్లలో ప్రయాణికులు నిలబడే ప్రయాణాలు చేశారు.

    ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

    రిజర్వేషన్ లేని ప్రయాణికులు కూడా రిజర్వుడు బోగీల్లోకి చొరబడి ప్రయాణించారు.

    కొంతమంది భోగి లోని డోర్ల వద్దే నిలబడి ప్రయాణాలు చేశారు.

    ఎన్నికల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే 43% అదనపు సర్వీసులను పెంచింది.

    ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఇండియన్​ రైల్వే రికార్డు స్థాయిలో 9,111 రైలు సర్వీసులను ఈ వేసవికాలంలో నడుపుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    China: 'మద్యం, సిగరెట్లు వద్దు': ఖర్చులు తగ్గించుకోవాలని చైనా అధికారులకు ఆదేశం చైనా
    Punjab: పంజాబ్‌లో ఆరుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు పంజాబ్
    Pawan Kalyan : పవన్ చేతిలో ఆస్కార్ ట్రోఫీ! కీరవాణితో సరదాగా గడిపిన క్షణాలు వైరల్ పవన్ కళ్యాణ్
    IMD: 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది: ఐఎండీ ఐఎండీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025