Page Loader
ఇండిగో విమానంలో విషాదం.. గాల్లో ఉండగానే  రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి
గాల్లో ఉండగానే రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి

ఇండిగో విమానంలో విషాదం.. గాల్లో ఉండగానే  రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 22, 2023
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండిగో విమానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులతో తుది శ్వాస విడిచాడు. ముంబై నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది. అయితే సదరు ప్రయాణికుడి అనారోగ్యం కారణంగా ఫ్లైట్ ను నాగ్‌పూర్‌లోని అంబేద్కర్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‭పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. సోమవారం రాత్రి 8 గంటలకు ముంబై నుంచి రాంచీకి ఇండిగో విమానం బయల్దేరింది. ప్రయాణం సందర్భంగా బాధితుడు వాంతులు చేసుకున్న విషయాన్ని విమానం సిబ్బంది గమనించారు. ఈ మేరకు పైలట్‌కు సమాచారం అందించారు.

DETAILS

 పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తాం : ఇండిగో

దీంతో తక్షణమే స్పందించిన పైలట్‌, ఇండిగో ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. అనంతరం అత్యవసర ల్యాండింగ్‌ నిమిత్తం విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించారు. అంతకుముందే విమానాశ్రయంలో సదరు ప్రయాణికుడి డి.తివారికి వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీంతో ఫ్లైట్ నాగ్‌పూర్‌ లో దిగగానే హుటాహుటిన ఆయన్ను కృష్ణ మెడికల్ ఆస్పత్రి(కిమ్స్)కి తరలించారు. పరీక్షించిన వైద్యులు, బాధితుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయారని నిర్థారించారు. ఈ మేరకు విమానయాన సంస్థ ఇండిగో ఓ ప్రకటన చేసింది. 62 ఏళ్ల వయసు గల డి.తివారి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో పాటు క్షయవ్యాధితో బాధపడుతున్నట్లు కిమ్స్ ఆస్పత్రి వైద్య నిపుణలు గుర్తించారు.