NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇండిగో విమానంలో విషాదం.. గాల్లో ఉండగానే  రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి
    తదుపరి వార్తా కథనం
    ఇండిగో విమానంలో విషాదం.. గాల్లో ఉండగానే  రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి
    గాల్లో ఉండగానే రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి

    ఇండిగో విమానంలో విషాదం.. గాల్లో ఉండగానే  రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 22, 2023
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండిగో విమానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులతో తుది శ్వాస విడిచాడు.

    ముంబై నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది. అయితే సదరు ప్రయాణికుడి అనారోగ్యం కారణంగా ఫ్లైట్ ను నాగ్‌పూర్‌లోని అంబేద్కర్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‭పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు.

    సోమవారం రాత్రి 8 గంటలకు ముంబై నుంచి రాంచీకి ఇండిగో విమానం బయల్దేరింది.

    ప్రయాణం సందర్భంగా బాధితుడు వాంతులు చేసుకున్న విషయాన్ని విమానం సిబ్బంది గమనించారు. ఈ మేరకు పైలట్‌కు సమాచారం అందించారు.

    DETAILS

     పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తాం : ఇండిగో

    దీంతో తక్షణమే స్పందించిన పైలట్‌, ఇండిగో ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. అనంతరం అత్యవసర ల్యాండింగ్‌ నిమిత్తం విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించారు.

    అంతకుముందే విమానాశ్రయంలో సదరు ప్రయాణికుడి డి.తివారికి వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీంతో ఫ్లైట్ నాగ్‌పూర్‌ లో దిగగానే హుటాహుటిన ఆయన్ను కృష్ణ మెడికల్ ఆస్పత్రి(కిమ్స్)కి తరలించారు.

    పరీక్షించిన వైద్యులు, బాధితుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయారని నిర్థారించారు. ఈ మేరకు విమానయాన సంస్థ ఇండిగో ఓ ప్రకటన చేసింది.

    62 ఏళ్ల వయసు గల డి.తివారి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో పాటు క్షయవ్యాధితో బాధపడుతున్నట్లు కిమ్స్ ఆస్పత్రి వైద్య నిపుణలు గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండిగో
    విమానం
    ముంబై
    రాంచీ

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    ఇండిగో

    ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగోకు భారీ జరిమానా.. రూ.30 లక్షలు చెల్లించాలని డీజీసీఏ ఆదేశం  బిజినెస్
    మరోసారి వివాదాస్పదమైన ఇండిగో.. ఏసీ లేకుండానే గాల్లోకి లేచిన విమానం విమానం

    విమానం

    గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ హైదరాబాద్
    రికార్డులను బద్దలు కొట్టిన నాసా మార్స్ హెలికాప్టర్ ఇంజన్యుటీ నాసా
    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు ఇజ్రాయెల్
    శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్  హైదరాబాద్

    ముంబై

    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  భారతదేశం
    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  అమెరికా

    రాంచీ

    కోర్టు ప్రాంగణంలో నాలుగో పెళ్లి పంచాయతీ.. లాయర్ భర్తను చితకబాదిన ముగ్గురు భార్యలు జార్ఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025