NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rammohan Naidu : కడప, కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రమంత్రి రామ్మోహన్
    తదుపరి వార్తా కథనం
    Rammohan Naidu : కడప, కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రమంత్రి రామ్మోహన్
    కడప, కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రమంత్రి రామ్మోహన్

    Rammohan Naidu : కడప, కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రమంత్రి రామ్మోహన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 28, 2024
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఆ దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

    బుధవారం దిల్లీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

    కడప జిల్లా కొప్పర్తిలోని పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ హబ్ విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కింద వస్తుందన్నారు.

    దీని కోసం కేంద్రం రూ.2,137 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఈ హబ్ ద్వారా 54,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

    Details

    ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ ద్వారా 45వేల మందికి జీవనోపాధి

    కర్నూలు జిల్లా ఓర్వకల్లులో మరో పారిశ్రామిక కారిడార్‌‌ను 2,621 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

    ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం రూ.2,786 కోట్లు చేస్తుందని, దీని ద్వారా 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

    ఈ రెండు పారిశ్రామిక కారిడార్లకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ ఆమోదించిందన్నారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో కేంద్రం, రాష్ట్రం కలిసి కట్టుగా ముందుకెళ్తున్నాయన్నారు.

    ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.

    Details

    పోలవరం ప్రాజెక్టు కోసం త్వరలోనే నిధులు 

    అనంతరం పోలవరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు.

    ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం త్వరలోనే రూ.12,000 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

    నవంబరులో పోలవరం పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయని, నిధులు కూడా త్వరలోనే విడుదలవుతాయని చెప్పారు.

    గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో వెనుకబడిందని, డబుల్ ఇంజిన్ గ్రోత్ ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కడప
    కర్నూలు

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    కడప

    కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్
    పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్ పులివెందుల
    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు
    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్

    కర్నూలు

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! కడప
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025