NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YS Jagan: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు.. ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
    తదుపరి వార్తా కథనం
    YS Jagan: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు.. ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
    దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు.. ప్రధానికి వైఎస్ జగన్ లేఖ

    YS Jagan: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు.. ప్రధానికి వైఎస్ జగన్ లేఖ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 22, 2025
    11:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ఎన్నికల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ(డీలిమిటేషన్)పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

    ఇందులో దక్షిణాది రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్యలో ఎలాంటి తగ్గింపు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

    దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన

    2026లో జరగనున్న డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

    జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్యను మారుస్తే, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందనే భయంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

    15ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా పెరిగిన కారణంగా, అక్కడి పార్లమెంటరీ సీట్లు తగ్గించే అవకాశముంది.

    గతంలో కేంద్రం జనాభా నియంత్రణకు పిలుపునివ్వడంతో ఆ రాష్ట్రాలు అందుకు అనుగుణంగా వ్యవహరించాయి.

    Details

    సమాన ప్రాతినిధ్యం అవసరం 

    పార్లమెంటరీ విధాన నిర్ణయాల్లో అన్ని రాష్ట్రాలకు సమాన హక్కు కల్పించేలా ఉండాలని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.

    ప్రజాస్వామ్య వ్యవస్థలో సమతుల్యత ఉండాలంటే, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలని ప్రధానిని కోరారు.

    ఇదే జరిగితే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం లభిస్తుందని వైఎస్ జగన్ తెలిపారు.

    న్యాయమైన డీలిమిటేషన్‌కు విజ్ఞప్తి

    ఈ అంశాన్ని సమగ్రంగా పరిగణించి, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం దక్షిణాదికి అన్యాయం కాకుండా చూడాలని వైఎస్ జగన్ మోదీని కోరారు.

    డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా లెక్కల ఆధారంగా కాకుండా, పార్లమెంటరీ భాగస్వామ్యం సమతుల్యతను కాపాడే విధంగా చేపట్టాలని లేఖలో స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా
    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌  ఆంధ్రప్రదేశ్
    Journalist houses In Ap : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కొనసాగుతున్న భేటీ ఆంధ్రప్రదేశ్
    Supreme Court : వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు.. రఘురామ పిటిషన్‌పై సుప్రీం సుప్రీంకోర్టు
    #YsJagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు షాక్.. తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    AP: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మహిళలకు సూపర్ ఛాన్స్.. ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం ఇండియా
    Active Andhra: క్రీడల ప్రోత్సాహానికి విద్యాశాఖ నూతన ప్రణాళిక.. 'యాక్టివ్ ఆంధ్ర' పేరుతో క్రీడా శిక్షణ ఇండియా
    AP Assembly: ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్య ప్రచారం.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు వైసీపీ
    Naga Babu: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం! జనసేన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025