NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, బ్రహ్మోస్‌ క్షిపణులతో దిగ్బంధనం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, బ్రహ్మోస్‌ క్షిపణులతో దిగ్బంధనం
    ఆపరేషన్‌ సిందూర్‌.. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, బ్రహ్మోస్‌ క్షిపణులతో దిగ్బంధనం

    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, బ్రహ్మోస్‌ క్షిపణులతో దిగ్బంధనం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' గురించి తెలిసిందే.

    ఈ ప్రతిచర్యకు పాకిస్థాన్‌ నుండి ఎదురుదాడి వచ్చే అవకాశాన్ని ముందుగానే గుర్తించిన భారత నౌకాదళం, సముద్రప్రాంతంలో తన సంసిద్ధతను మరింతగా మెరుగుపరిచేందుకు పలు కీలక చర్యలు చేపట్టింది.

    ఇందులో భాగంగా, పాకిస్తాన్‌లోని కరాచీ పోర్ట్‌ను ప్రధాన లక్ష్యంగా తీసుకొని, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌తో పాటు బ్రహ్మోస్ క్షిపణులు అమర్చిన యుద్ధ నౌకలు,జలాంతర్గాములను మోహరించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

    ఈ మోహరింపు విజయవంతమై, ఆపరేషన్ సిందూర్‌ సఫలమైనదని వాటి ప్రకటనలో తెలిపారు.

    వివరాలు 

    కరాచీ పోర్ట్‌ను లక్ష్యంగా..  36ఫ్రంట్‌లైన్ నౌకాదళాలు 

    ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్‌పై త్రిముఖ ఒత్తిడికి వ్యూహాత్మకంగా ప్రణాళిక రూపొందించిందని అధికారులు వివరించారు.

    కరాచీ పోర్ట్‌ను లక్ష్యంగా చేసుకొని మొత్తం 36ఫ్రంట్‌లైన్ నౌకాదళాలను మోహరించామని తెలిపారు.

    వీటిలో ఏడు బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన డిస్ట్రాయర్లు, మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు(MRSAM),వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడోలు ఉన్నాయి.

    అంతేకాకుండా ఇటీవలే నౌకాదళంలో చేరిన INS తుషిల్‌తో సహా మొత్తం ఏడు స్టెల్త్ గైడెడ్ క్షిపణి యుద్ధనౌకలను మోహరించినట్టు వివరించారు.

    INS విక్రాంత్‌తో కలిసి బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి కరాచీ పోర్ట్‌ను దిగ్బంధించడంతో, పాకిస్తాన్ నౌకాదళం సమర్థవంతమైన ప్రతిస్పందన ఇవ్వలేకపోయిందని,వారు కేవలం తమ నౌకాశ్రయాల్లోనే పరిమితం కావాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

    ఈఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలు తమ మార్గాలను మార్చుకున్నాయి.

    వివరాలు 

    11 వాయుసేన స్థావరాల ధ్వంసం

    పహల్గాం ఉగ్రదాడికి స్పందనగా భారత్‌ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించింది.

    విశ్లేషకుల ప్రకారం,భారత క్షిపణులు పాకిస్తాన్ అణుస్థావరాలను కూడా లక్ష్యంగా చేసినట్లు చెబుతున్నారు.

    మే 9 అర్ధరాత్రి నుంచి 10వ తేదీ వరకు, పాకిస్తాన్‌లోని కీలకమైన వాయుసేన స్థావరాలపై భారత వైమానిక దళం అత్యంత ఖచ్చితంగా దాడులు జరిపిందని భారత ప్రభుత్వం ప్రకటించింది.

    దేశీయంగా తయారైన ఆయుధాలతో ఈ దాడులు జరిపామని, మొత్తం 11 వాయుసేన స్థావరాలను ధ్వంసం చేశామని పేర్కొంది.

    రావల్పిండి సమీపంలోని నూర్‌ఖాన్ ఎయిర్ బేస్‌ పై కూడా, ఇది పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్‌కి సమీపంలో ఉండటంతో, భారత సైన్యం ప్రిసిషన్ స్ట్రైక్స్‌ చేసింది.

    దీంతో పాకిస్తాన్, అమెరికా సహకారంతో భారత్‌తో సంభాషించేందుకు సిద్ధమైంది.

    వివరాలు 

    INS విక్రాంత్ ప్రత్యేకతలు: 

    రూ. 20 వేల కోట్ల వ్యయంతో నిర్మించబడిన INS విక్రాంత్‌ను 2022 సెప్టెంబర్‌లో భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.

    ఇది భారత్‌లో తయారైన అతిపెద్ద యుద్ధనౌకగా గుర్తించబడుతోంది.

    దీని పొడవు 262 మీటర్లు కాగా, వెడల్పు 62 మీటర్లు. ఇది మిగ్-29కే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో సహా మొత్తం 30 యుద్ధ విమానాలను తీసుకెళ్లగలదు.

    INS విక్రాంత్‌కు సంబంధించిన డిజైన్‌ను భారత నౌకాదళంలోని వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించగా, దీని నిర్మాణాన్ని కొచ్చిన్ షిప్ యార్డు పూర్తిచేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, బ్రహ్మోస్‌ క్షిపణులతో దిగ్బంధనం ఆపరేషన్‌ సిందూర్‌
    Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ..  రోహిత్ శర్మ
    US-Saudi Arabia: అమెరికా-సౌదీ మధ్య 142 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ ఆయుధ ఒప్పందం అమెరికా
    Official : విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' రిలీజ్ డేట్ ఖరారు  విజయ్ దేవరకొండ

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. జైషే స్థావరం ఇలా ఉంది.. వీడియో విడుదల చేసిన బీజేపీ  భారతదేశం
    Operation Sindoor: బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం.. వైరల్‌ అయిన ఉపగ్రహ చిత్రాలు  భారతదేశం
    Opertion Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ .. రాజస్థాన్‌లో పాకిస్థాన్ బోర్డర్‌ సీల్‌.. పంజాబ్‌లో హైఅలర్ట్‌..! భారతదేశం
    Operation Sindoor: పాకిస్థానీ నటీనటులపై బ్యాన్‌.. ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పిలుపు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025