NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jharkhand: పరీక్షల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేత 
    తదుపరి వార్తా కథనం
    Jharkhand: పరీక్షల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేత 
    పరీక్షల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేత

    Jharkhand: పరీక్షల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేత 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 21, 2024
    09:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    రాబోయే శని, ఆదివారాల్లో రాష్ట్రంలో జనరల్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌ (JGLCCE) లో పరీక్షలు జరగనున్నాయి.

    ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

    ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 823 కేంద్రాల్లో నిర్వహించనుండగా, దాదాపు 6.39 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని అధికారులు తెలిపారు.

    Details

    పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి 

    శని, ఆదివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరుగుతుంది.

    ఈ సమయంలోనే మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయనున్నారు.

    ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తెలిపారు.

    పరీక్షల సమయంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హేమంత్ సోరెన్
    జార్ఖండ్

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    హేమంత్ సోరెన్

    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం జార్ఖండ్
    భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు  జార్ఖండ్
    Hemant Soren: భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం సోరెన్‌కు ఈడీ మరోసారి సమన్లు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Hemant Soren : సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు జార్ఖండ్

    జార్ఖండ్

    రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్  రైలు ప్రమాదం
    నక్సల్స్ సానుభూతిపరులే లక్ష్యంగా జార్ఖండ్, బిహార్‌లోని ఏడు చోట్ల ఎన్ఐఏ దాడులు  ఎన్ఐఏ
    అక్రమ మైనింగ్ తో కుప్పకూలిన బొగ్గుగని.. అక్కడిక్కడే ముగ్గురి దుర్మరణం భారతదేశం
    మైనింగ్ స్కామ్‌ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు  బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025