NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలోనే అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్కు భారీ వరద.. 26 గేట్లు ఎత్తివేత
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణలోనే అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్కు భారీ వరద.. 26 గేట్లు ఎత్తివేత
    ఉత్తర తెలంగాణ వరప్రదాయణి శ్రీరాంసాగర్కు భారీ వరద.. 26 గేట్లు ఎత్తివేత

    తెలంగాణలోనే అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్కు భారీ వరద.. 26 గేట్లు ఎత్తివేత

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 27, 2023
    05:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.

    నిజామాబాద్‌ జిల్లాలో వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా మారుతున్నాయి. దీంతో పలు చోట్ల మత్తడి దుంకుతున్నాయి. వర్షాల ధాటికి వాగులు వంకలు సైతం పొంగిపొర్లుతున్నాయి.

    ఊరు వాడ, పల్లె పట్టణం తేడా లేకుండా వర్షాలు దంచికొడుతుండటంతో వరద నీరంతా సమీప ప్రాజెక్టుల్లోకి చేరిపోతోంది.

    తెలంగాణలోనే అతిపెద్దదైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 2 లక్షల 22 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 26 గేట్లను అధికారులు ఎత్తేశారు.

    ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు ఉంది. ఈ మేరకు వచ్చిన వరద నీటిని అలాగే దిగువకు వదిలేస్తున్నారు.

    DETAILS

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాజెక్టుల్లోకి భారీగా చేరుతున్న వరద నీరు  

    కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌, జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌ నాలా ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుకుంటోంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ సింగూరు నుంచి వరద ఉద్ధృతి పెరుగుతున్న కారణంగా రిజర్వాయర్ నిండిపోయింది.

    జిల్లాలోని మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం మండలాల్లో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో వాగులు వంకలు పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో అతి భారీవర్షాలు కురువనున్నాయి.

    ఈ మేరకు ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. రైతులు పొలాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉండాలని సూచించింది. మక్క, సోయా, పత్తి పంటలను వరద చుట్టు ముట్టిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    తెలంగాణ

    YELLOW ALERT: తెలంగాణకు వర్ష సూచన.. మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు నైరుతి రుతుపవనాలు
    మరోసారి వివాదాస్పదమైన తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు .. క్షమాపణ చెప్పాలని కడియం డిమాండ్ భారతదేశం
    హైదరాబాద్ పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రోకు గ్రీన్ సిగ్నల్  మెట్రో స్టేషన్
    నేటి నుంచి వీఆర్ఏలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు.. జేపీఎస్​ల రెగ్యులరైజేషన్​కు కమిటీలు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025