NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వైఎస్ కుటుంబం చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా? 
    తదుపరి వార్తా కథనం
    వైఎస్ కుటుంబం చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా? 
    వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా?

    వైఎస్ కుటుంబం చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా? 

    వ్రాసిన వారు Stalin
    Apr 29, 2023
    02:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, వైఎస్ కుటుంబంలో కూడా తీవ్రఅలజడిని రేపుతోంది. వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో వైఎస్ కుటుంబం నిలువుగా చీలిపోయిందనేది బహిరంగ రహస్యం.

    గతంలోనే షర్మిల- వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య దూరం పెరిగింది. ఆమె సొంతపార్టీ పెట్టుకొని తెలంగాణలో పోరాడుతున్నారు. విజయమ్మ వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి కూతురుతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు.

    వివేకానందరెడ్డి రెండో పెళ్లిపై అవినాష్‌రెడ్డి ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కుటుంబంలోని కొందరిని నొప్పించాయి.

    ఇలాంటి పలు సంఘటనలు వైఎస్ కుటుంబంలో వర్గపోరును స్పష్టం చేస్తున్నాయి.

    రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆ కుటుంబం ఒక్కటిగా ఎలా ఉందో, జగన్ హయాంలో అందుకు విరుద్ధంగా ఉంది.

    వైఎస్ వివేక

    వైఎస్ కుటుంబంలో విబేధాలు కడప జిల్లా పాలిటిక్స్‌పై ప్రభావం

    అయితే వైఎస్ కుటుంబంలో ఈ పరిమాణాలు కేవలం వాళ్లు ఫ్యామిలీకి మాత్రమే సంబంధించినవి కాదనే విషయం గ్రహించాలి. రాష్ట్ర రాజకీయాలను, ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప పాలిటిక్స్‌పై పెను ప్రభావాన్ని చూపుతాయి.

    వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న అవినాష్ రెడ్డికి సీఎం జగన్ మద్దుతుగా నిలుస్తున్నారు. ఈ విషయం వివేకానందరెడ్డి వర్గానికి నచ్చడం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో కొన్నాళ్లుగా వైఎస్ వివేక వర్గం జగన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    అంతేకాకుండా సునీత చేస్తున్న న్యాయపోరాటానికి వివేక వర్గం పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం.

    కడప జిల్లాలో ఈ వర్గపోరు భవిష్యత్‌లో సంచలన రాజకీయ పరిణామాలకు నాంది పలకబోతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

    వైఎస్ వివేక

    వైఎస్ భారతి బంధువులు మాత్రమే జగన్ వెంట?

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆ కుటుంబంలో సగం మంది జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

    వైఎస్ భారతి బంధువు అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి( అవినాష్ రెడ్డి తండ్రి) తరఫు వారు మాత్రమే జగన్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది.

    ఆఖరికి జగన్ సొంత చెల్లలు కూడా వివేక కూతురు సునీతకే మద్దతు తెలపడం, ఆమెకు అండగా ఉంటానని ప్రకటించడం గమనార్హం.

    ఇదే సమయంలో వైఎస్ కుటుంబంలోని ఒక వర్గం వేరే రాజకీయ వేదికవైపు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    ఇటీవల తెలుగుదేశం పార్టీ పోస్టర్లలో సునీత ఫొటో కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే పోస్టర్లతో తమకు సంబంధం లేదని, అది వైసీపీ‌ పని టీడీపీ ఆరోపిస్తోంది.

    వైఎస్ వివేక

    2024 ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ ఉండొచ్చా?

    తాజాగా జరుగుతున్న పరిణామాలను పట్టి చూస్తే 2024 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాల్లో వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ అనే విధంగా రాజకీయ పోరు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

    వైఎస్ ఫ్యామిలీలోని ఒక వర్గం మద్దతో పాటు వివేకాకు ఉన్న రాజకీయ అనుచరగణం సపోర్టుతో సునీత వచ్చే ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా నిలబడుతోందనే ప్రచారం జరుగుతోంది.

    ముఖ్యంగా కడప పార్లమెంట్ స్థానంలో సునీతను నిలబెట్టే అవకాశం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి వైఎస్ భారతీని గానీ, మరో బలమైన అభ్యర్థిని గానీ జగన్ నిలబెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కడప
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    వైఎస్సార్ కడప
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కడప

    కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి
    పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్ పులివెందుల
    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు
    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్

    వైఎస్సార్ కడప

    వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు సీబీఐ
    వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ హైకోర్టు
    వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత ఆంధ్రప్రదేశ్
     వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు  సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    తాలిబన్ చేతిలో కాబూల్‌ విమానాశ్రయంలో ఉగ్రదాడి సూత్రదారి హతం  ఆఫ్ఘనిస్తాన్
    దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు కరోనా కొత్త కేసులు
    లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం పూరీ జగన్నాథ దేవాలయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025