NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Terror links: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Terror links: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
    జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

    Terror links: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 03, 2025
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది.

    లష్కరే తోయిబా,హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో అనుబంధాలు ఉన్నట్లు గుర్తించిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను పదవి నుండి తొలగించారు.

    ఈ ఉత్తర్వులను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారికంగా జారీ చేశారు.

    ఈ ముగ్గురిలో పోలీస్ కానిస్టేబుల్ మాలిక్ ఇష్ఫాక్ నసీర్, స్కూల్ టీచర్ అజాజ్ అహ్మద్, ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే వసీం అహ్మద్ ఖాన్ ఉన్నారు.

    ఇలాంటి చర్యలు జాతీయ భద్రత ప్రయోజనాల దృష్ట్యా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

    ఇప్పటివరకు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం 75 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులపై ఉగ్రవాద సంబంధాల ఆరోపణల నేపథ్యంలో తొలగింపు చర్యలు తీసుకుంది.

    వివరాలు 

    అతడు పోలీస్‌.. సోదరుడు ఉగ్రవాది..! 

    జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నవారిపై నిరంతరం గమనిస్తుండగా,ప్రభుత్వ వ్యవస్థలో సానుభూతి కలిగిన వ్యక్తులను కూడా గుర్తించడానికి చర్యలు కొనసాగుతోంది.

    తాజాగా తొలగించిన ఉద్యోగులపై ఉగ్రవాదులకు సహాయంగా లాజిస్టిక్ సామగ్రిని అందించడం, ఆయుధాల అక్రమ రవాణా, భద్రతా దళాలకు వ్యతిరేకంగా ముష్కర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం వంటి ఆరోపణలు ఉన్నాయి.

    కానిస్టేబుల్ మాలిక్ ఇష్ఫాక్ 2007లో పోలీస్ శాఖలో చేరాడు.అతడి సోదరుడు మాలిక్ ఆసిఫ్ లష్కరే తయ్యిబాకు చెందిన ఉగ్రవాది,పాకిస్తాన్‌లో శిక్షణ పొందాడు.

    2018లో జరిగిన ఎదురుకాల్పుల్లో అతను హతమయ్యాడు. సోదరుడి మృతి తర్వాత కూడా ఇష్ఫాక్ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తూ,వారికి ఆయుధాలు,బాంబులు, మాదకద్రవ్యాలను సరఫరా చేయడానికి అవసరమైన ప్రదేశాలను గుర్తించి, వాటి జీపీఎస్ స్థానం పాక్‌లో ఉన్న హ్యాండ్లర్లకు పంపేవాడు.

    వివరాలు 

    పైకి టీచర్‌గా.. లోపల హిజ్బుల్‌ కార్యకర్తగా.. 

    అక్కడికి చేరిన ఆయుధాలను తరువాత జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదులకు అందించేవాడు.

    2021లో ఆయుధాల అక్రమ రవాణా కేసులో ఇతని లష్కరేతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

    అజాజ్ అహ్మద్ 2011లో టీచర్‌గా ప్రభుత్వ విద్యాశాఖలో ఉద్యోగంలో చేరాడు.

    కానీ అతడు హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు ఆయుధాలు మరియు ప్రచార సామగ్రి చొరబాట్లను స్మగ్లింగ్ చేసేవాడు.

    2023లో పోలీసు తనిఖీల్లో అతడు, అతడి మిత్రుడితో పాటు పట్టుబడ్డారు.

    అతడికి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని హిజ్బుల్ కార్యకర్త అబిద్ రంజాన్ షేక్ నుంచి ఆయుధాలు అందినట్లు నిర్ధారణ అయింది.

    అతడు కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుంటూ, పూంచ్ ప్రాంతంలో హిజ్బుల్‌కు విశ్వసనీయ కార్యకర్తగా ఎదిగాడు.

    వివరాలు 

    సుజాత్‌ బుఖారీ హత్య కుట్రలో నిందితుడు.. 

    వసీం అహ్మద్ ఖాన్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, లష్కరే, హిజ్బుల్ సంస్థల కోసం పనిచేశాడు.

    2018లో జర్నలిస్ట్ సుజాత్ బుఖారీ, ఆయన శరీరరక్షకుడిపై జరిగిన హత్య కుట్రలో ఇతడి హస్తం ఉన్నట్లు విచారణల్లో తేలింది.

    ఈ దాడిని అంజామిచ్చిన ఉగ్రవాదులను ఘటనాస్థలం నుంచి పారిపోవడానికి సహకరించిన ఘటనా సమయంలో ఇతడిని అరెస్ట్ చేశారు.

    అదే ఏడాది ఆగస్టులో శ్రీనగర్‌లోని బట్‌మాలూ వద్ద జరిగిన ఉగ్రవాద చర్యల కేసులో ఇతని పాత్రపై విచారణ జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Terror links: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు జమ్ముకశ్మీర్
    Samantha: సమంతకు భారీ లాభాలు.. 'శుభం' ఓటీటీ డీల్‌కు రికార్డు రేట్! సమంత
    YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    జమ్ముకశ్మీర్

    Line of Control: ఎల్‌ఓసి వద్ద పాక్‌ మళ్లీ కాల్పులు.. పెరుగుతున్న ఉద్రికత్తలు భారతదేశం
    Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం ఉగ్రవాదులు
    Maharashtra: భారత్‌లో 107 మంది పాకిస్థాన్ పౌరులు మిస్సింగ్.. భద్రతా సంస్థలు అలర్ట్ మహారాష్ట్ర
    Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. ఉగ్రవాదుల ప్రణాళికపై కీలక సమాచారం వెలుగులోకి! ఉగ్రవాదులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025