NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. జై తెలుగు పేరిట ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. జై తెలుగు పేరిట ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటన
    జై తెలుగు పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నాం : జొన్నవిత్తుల

    ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. జై తెలుగు పేరిట ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 20, 2023
    04:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీకి తెర లేచింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం నూతన పార్టీ ఏర్పడనుంది.

    ఎన్నికలకు కాలం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి.

    సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. జై తెలుగు పేరిట తాను పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడలో విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

    40 ఏళ్ల కిందట తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం ఏర్పాటైంది. అయితే తెలుగు భాష సంరక్షణ కోసం జొన్నవిత్తుల మరో పార్టీని ఏర్పాటు చేయనున్నారు. భాషా ప్రాతిపదికన ఏర్పాటైన తొలి పార్టీగా జై తెలుగు చరిత్రకెక్కింది.

    DETAILS

    వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తాం : జొన్నవిత్తుల

    వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో జై తెలుగు పార్టీ తరఫున పోటీ చేస్తామని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. తెలుగు భాషా సంస్కృతిని పరిరక్షించే ఏకైక లక్ష్యంతో ప్రత్యేక రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నానన్నారు.

    భాషా, సంస్కృతి పరంగా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వీధిన పడిపోయిందన్న జొన్నవిత్తుల, విలువలను కాపాడేందుకే నేతలు, ప్రజలు పనిచేయాలని కోరారు.

    ఆగస్ట్ 15 నాటికి పార్టీ విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. జై తెలుగు పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని కూడా రూపొందించామన్నారు.

    1. నీలం రంగు నీటికి,

    2. పచ్చ రంగు వ్యవసాయానికి,

    3. ఎరుపు రంగు శ్రమశక్తికి,

    4. పసుపు రంగు వైభవానికి చిహ్నం,

    5. తెలుపు రంగు జల వనరులు స్వచ్ఛంగా ఉండటానికి అని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఎన్నికలు

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ కీలక భేటీ.. ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్ వై.ఎస్.జగన్
    తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం వర్షాకాలం
    ఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ప్రభుత్వం

    ఎన్నికలు

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025