దేశంలో మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ
దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మరోవైపు ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని విపక్షాలు ఇండియా కూటమి పేరుతో వరుస సమావేశాలను నిర్వహిస్తోంది. దీంతో మరోసారి జమిలి ఎన్నికలు తెరపైకి వచ్చింది.2024 మే-జూన్లో షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. గురువారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కేంద్రం ప్రకటించింది.జమిలి ఎన్నికలపై శుక్రవారం మాజీ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ నేతృత్వంలో 16 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. ఒకే దేశం- ఒకే ఎన్నిక పేరుతో పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది.ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కోవింద్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.