NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-Pakistan: : నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం పాక్‌ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి
    తదుపరి వార్తా కథనం
    India-Pakistan: : నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం పాక్‌ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి
    నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం పాక్‌ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి

    India-Pakistan: : నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం పాక్‌ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    08:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా భారత సైన్యం పాకిస్థాన్‌ భూభాగంలో నిర్వహించిన 'ఆపరేషన్‌ సిందూర్‌' అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకు గురయ్యాయి.

    ఈ మెరుపు దాడుల అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్‌ రేంజర్లు విచక్షణ లేకుండా కాల్పులు జరుపుతుండటం గమనార్హం.

    గురువారం రోజూ పాక్‌ సైన్యం కవ్వింపులను కొనసాగించినట్టు సమాచారం.

    కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్‌ సెక్టార్లలో ఉన్న సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్‌ బలగాలు మోర్టార్లతో షెల్లింగ్‌, తుపాకులతో కాల్పులు జరుపుతున్నాయి.

    ఈ దాడులకు భారత సైన్యం సమర్థంగా ప్రతిస్పందిస్తూ ఎదురు కాల్పులు చేస్తోంది.

    పాకిస్తాన్‌ సైన్యం ప్రత్యేకంగా నివాస ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతుండటంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురై సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

    వివరాలు 

    దాడుల్లో 13మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు

    ఇదిలాఉండగా, బుధవారం అర్ధరాత్రి పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను వీరమరణం పొందినట్లు సమాచారం.

    పాక్‌ షెల్లింగ్‌లో గాయపడి 5వ ఫీల్డ్‌ రెజిమెంట్‌కు చెందిన లాన్స్‌ నాయక్‌ దినేశ్‌కుమార్‌ ప్రాణాలు కోల్పోయినట్టు వైట్‌ నైట్‌ కోర్‌ అధికారికంగా ధృవీకరించింది.

    మరోవైపు, మంగళవారం అర్ధరాత్రి నుంచి పూంఛ్‌,తంగ్ధర్‌ సెక్టార్లలో పాక్‌ బలగాలు కాల్పులను కొనసాగించాయి.

    ఈ దాడుల్లో 13మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు.గాయపడిన వారి సంఖ్య 57గా ఉండగా, మృతులలో నలుగురు చిన్నారులూ ఉన్నారు.

    పహల్గాం దాడి తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మిగిలేలా కొనసాగుతుండగా, గత 14 రోజులుగా పాకిస్తాన్‌ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అసంఖ్యాకంగా ఉల్లంఘిస్తూ ఉగ్రవాద చర్యలకు ప్రోత్సాహం ఇస్తున్నట్లుగా భారత సైన్యం అభిప్రాయపడుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లైన్ అఫ్ కంట్రోల్ (ఎల్ ఓ సి)

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    లైన్ అఫ్ కంట్రోల్ (ఎల్ ఓ సి)

    ఇండో చైనా సరిహద్దు వివాదాలు.. ఇరుదేశాల 19వ సారి శాంతి చర్చలు సానుకూలం భారతదేశం
    India- Pakistan: J&Kలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం కాల్పులు  జమ్ముకశ్మీర్
    India-Pakistan: ఎనిమిదో రోజూ అదే తీరు.. ఎల్వోసీ వెంబడి పాక్‌ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్‌ భారతదేశం
    Pakistan: మరోసారి కాల్పులకు దిగిన పాకిస్తాన్.. కౌంటర్ ఇచ్చిన భారత సైనికులు.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025