Page Loader
Ap Uranium: యురేనియంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..ఆ 4 ఏపీ జిల్లాల్లో అన్వేషణ
యురేనియంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..ఆ 4 ఏపీ జిల్లాల్లో అన్వేషణ

Ap Uranium: యురేనియంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..ఆ 4 ఏపీ జిల్లాల్లో అన్వేషణ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 15, 2023
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో యురేనియంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.ఈ మేరకు లోక్‌సభలో అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. ఏపీలోని నాలుగు జిల్లాల్లో యురేనియం నిల్వల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికే ఖనిజం కోసం అన్వేషణలు కొనసాగుతున్నాయన్నారు. మొత్తం 11 రాష్ట్రాల్లో AMD అన్వేషలు సాగుతున్నాయన్నారు. పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని నాలుగు జిల్లాల్లో బంగారు గనులు సైతం ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. ఇదే సమయంలో యురేనియం నిల్వలు సైతం ఉన్నట్లు కేంద్రం అంటోంది. కడప, అన్నమయ్య, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో యురేనియం ఖనిజం కోసం అన్వేషిస్తున్నట్లు కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.

details

ఆ నాలుగు జిల్లాల్లో యూరేనియం నిల్వులు : కేంద్రం

కడప జిల్లాలోని నల్లగొండ వారిపల్లె, అంబకాపల్లె, బక్కన్నగారిపల్లె, శివారంపురం, పించ, కుమరంపల్లె, నాగాయపల్లెలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. పల్నాడు జిల్లాలో సారంగపల్లె, మదినపాడు, తంగెడ, కర్నూలు జిల్లాలో బొమ్మరాజుపల్లె, మినకహల్‌పాడు, కప్పట్రాళ్లలో ఉన్నట్లు గుర్తించామన్నారు. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోని కడప, అన్నమయ్య, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో యురేనియం ఖనిజం కోసం అన్వేషిస్తున్నట్లు కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ అన్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో సంత్‌ బల్బీర్‌సింగ్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.