NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి 
    తదుపరి వార్తా కథనం
    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి 
    ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి

    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి 

    వ్రాసిన వారు Stalin
    Apr 22, 2023
    11:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికార బీజేపీ దూకుడు పెంచింది. అగ్రనేతలను రంగంలోకి దించుతోంది.

    బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శుక్రవారం బీదర్‌లో రోడ్‌షో నిర్వహించడం, మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్ణాటకలో బీజేపీ నాయకులతో సమావేశం కావడం చూస్తుంటే, రాష్ట్రంపై కమలనాథులు ఎంత ఫోకస్ పెట్టారో స్పష్టమవుతోంది.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మూడు రోజులు పర్యటన నిమిత్తం శుక్రవారం కర్ణాటకకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారు.

    అలాగే శనివారం జరగనున్న పలు మీడియా కార్యక్రమాల్లోనూ అమిత్ షా, నడ్డాతో పాటు సీఎం బస్వరాజ్ బొమ్మై పాల్గొననున్నారు.

    కర్ణాటక

    ప్రధాని మోదీ ఛరిష్మాపై బీజేపీ నమ్మకం

    కర్ణాటక ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్‌లకు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో వారిలో కొందరు కాంగ్రెస్‌లో చేరగా, మరికొందరు రెబెల్స్‌గా బరిలోకి దిగుతున్నారు.

    ఈ పరిణామం బీజేపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    అయితే బీజేపీ మాత్రం మొదటి నుంచి ప్రధాని మోదీ ఛరిష్మా‌పైనే ఆధారపడుతోంది. బీజేపీని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నరేంద్ర మోదీ ఒక్కరు చాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

    బీజేపీ ప్రచారం కూడా ప్రధాని మోదీ సెంట్రిక్ గానే జరుగుతోంది. ఎక్కడ సభ పెట్టినా రాష్ట్ర నాయకులకంటే మోదీనే ఎక్కువ ప్రొజెక్ట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

    బీజేపీ

    ఒక వైపు ప్రచారం చేస్తూనే అసంతృప్తుల బుజ్జగింపు

    ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకకు వచ్చిన అమిత్ షా, నడ్డా రాష్ట్రంలో రాజకీయ వ్యూహాలను కూడా పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    రాష్ట్రంలో ఒకవైపు ప్రచారం చేస్తూనే, టికెట్ రాని అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు.

    సీనియర్ నేత మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

    శివమొగ్గ నియోజకవర్గంలో కేఎస్ ఈశ్వరప్పకు బలమైన క్యాడర్ ఉంది. రాష్ట్రంలో ఆయనకు అనుచర వర్గం కూడా గొప్పగానే ఉంది.

    దీంతో కేఎస్ ఈశ్వరప్పను సంతృప్తి పరిచేందుకు నడ్డా, అమిత్ షా రంగంలో దిగినట్లు సమాచారం.

    వీరి చొరవతోనే ప్రధాని మోదీ ఈశ్వరప్పతో మాట్లాడారు. స్వయంగా మోదీనే ఫోన్ చేయడంతో ఈశ్వరప్ప కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    తాజా వార్తలు
    జేపీ నడ్డా

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    కర్ణాటక

    2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు ఎన్ఐఏ
    ఐఫోన్ కోసం డెలివరీ బాయ్ హత్య- నాలుగురోజులుగా బాత్‌రూమ్‌లోనే మృతదేహం ఐఫోన్
    '10మంది ముస్లిం బాలికలను ట్రాప్ చేయండి, భద్రత కల్పిస్తాం'; శ్రీరామ్ సేన అధ్యక్షుడు సంచలన కామెంట్స్ అసెంబ్లీ ఎన్నికలు

    అసెంబ్లీ ఎన్నికలు

    త్రిపురలో ముగిసిన పోలింగ్; మార్చి 2న ఓట్ల లెక్కింపు త్రిపుర
    2024 ఎన్నికల్లో జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు విశాఖపట్టణం
    మేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని నాగాలాండ్
    నాగాలాండ్: 60ఏళ్ల అసెంబ్లీ చరిత్రలో మహిళకు దక్కని ప్రాతినిధ్యం; ఈసారైనా అబల గెలిచేనా? నాగాలాండ్

    తాజా వార్తలు

     అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్  ఉత్తర్‌ప్రదేశ్
    ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా‌గ్రామ్‌లో 4వేల ఉద్యోగాల కోతకు 'మెటా' సన్నద్ధం  మెటా
    యూకేలో భారతీయం; సంబల్‌పురి చీరను ధరించి మారథాన్‌లో నడిచిన ఒడిశా మహిళ  బ్రిటన్
    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్

    జేపీ నడ్డా

    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు లోక్‌సభ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025