NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి
    తదుపరి వార్తా కథనం
    కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి
    కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి

    కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి

    వ్రాసిన వారు Stalin
    May 13, 2023
    09:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 10 సంవత్సరాల తర్వాత కర్ణాటకలో హస్తం పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చింది.

    136 సీట్లలో విజయం సాధించి, దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

    2018లో గెలుపొందిన 104 సీట్లను గెల్చుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో 65 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

    2023 ఎన్నికల్లో కూడా కింగ్ మేకర్‌ అవ్వాలని ఆశపడిన జేడీ(ఎస్) కేవలం 19 సీట్లను మాత్రమే గెల్చుకుంది. తద్వారా జేడీ(ఎస్) కింగ్ మేకర్‌ అవ్వాలన్న ఆశ అడియాశలయ్యాయి.

    కాంగ్రెస్

    38.04 శాతం నుంచి 42.94 శాతానికి పెరిగిన కాంగ్రెస్ ఓటు షేరు

    2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 36.22(2018లో) నుంచి 35.8 శాతానికి పడిపోయింది.

    కాంగ్రెస్ ఓట్ల శాతం 38.04(2018లో) శాతం నుంచి 42.94 శాతానికి పెరిగింది.

    1985 నుంచి అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి పవర్‌లోకి రాలేదు. ఈ సారి కూడా కర్ణాటకలో పాత సంప్రదాయమే కొనసాగింది.

    1989లో కాంగ్రెస్ 178 సీట్లు గెల్చుకుంది. అప్పటి నుంచి కాంగ్రెస్ అత్యుత్తమంగా సీట్లను గెల్చుకున్నది ఈ సారే కావడం గమనార్హం.

    త్వరలో తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో పాటు ఈ ఏడాది మరో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్‌కు పెద్ద బూస్టప్‌గా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

    కాంగ్రెస్

    భారత్ జోడో యాత్ర సాగిన మార్గంలో 99% సీట్లు గెలిచాం: మల్లికార్జున్ ఖర్గే

    కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కాంగ్రెస్‌కు పెద్ద విజయం అన్నారు.

    దీని ద్వారా దేశం మొత్తంలో ఒక కొత్త శక్తి ఉద్భవించిందన్నారు. భారత్ జోడో యాత్ర కన్యా కుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగిందని, కర్ణాటకలో రాహుల్ గాంధీ నడిచిన మార్గంలో దాదాపు 99 శాతం సీట్లు సాధించామన్నారు.

    అందుకు ఆయనకు ధన్యవాదాలని మల్లికార్జున్ అన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలంటే ప్రజలు ఇలా ఐక్యంగా ఉండాలన్నారు. అప్పుడే యుద్ధంలో విజయం సాధించగలమని పేర్కొన్నారు.

    Embed

    సీఎం పదవికి రాజీనామా చేసిన బొమ్మై

    #WATCH | Karnataka CM & BJP leader Basavaraj Bommai arrives at Raj Bhawan to tender his resignation to the Governor#KarnatakaElectionResults2023 pic.twitter.com/VKMinLgKPu— ANI (@ANI) May 13, 2023

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    కాంగ్రెస్
    అసెంబ్లీ ఎన్నికలు
    తాజా వార్తలు

    తాజా

    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్
    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్
     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్

    కర్ణాటక

    నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ ఎన్నికల సంఘం
    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు
    Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్ కాంగ్రెస్

    కాంగ్రెస్

    ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్
    సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్ రాహుల్ గాంధీ
    కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    అసెంబ్లీ ఎన్నికలు

    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు: 'రాహుల్ జీ.. కర్ణాటక సమస్యలపై గొంతు విప్పాలి'; కాంగ్రెస్ శ్రేణుల వేడుకోలు కర్ణాటక
    అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు కర్ణాటక

    తాజా వార్తలు

    కర్ణాటకలో మళ్లీ హంగ్; సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్; ఎగ్జిట్ పోల్స్ అంచనా కర్ణాటక
    National Technology Day 2023: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?  టెక్నాలజీ
    అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు; వారం రోజుల్లో మూడో బ్లాస్ట్ పంజాబ్
    దేశంలో కొత్తగా 1,690 కరోనా కేసులు; 12మంది మృతి కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025