Page Loader
Terror Attack: రూ.10 లక్షల పరిహారం.. బ్లాక్‌ కలర్‌లో కశ్మీర్ పత్రికల ఫ్రంట్‌ పేజ్‌
రూ.10 లక్షల పరిహారం.. బ్లాక్‌ కలర్‌లో కశ్మీర్ పత్రికల ఫ్రంట్‌ పేజ్‌

Terror Attack: రూ.10 లక్షల పరిహారం.. బ్లాక్‌ కలర్‌లో కశ్మీర్ పత్రికల ఫ్రంట్‌ పేజ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2025
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన ఈ దాడి తీవ్రంగా హిందూపై ప్రభావం చూపించింది. ఈ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు.

వివరాలు 

ఘటన స్థలాన్ని సందర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా 

మంగళవారం జరిగిన ఈ దాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనంత్‌నాగ్‌కు చేరుకున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని దగ్గరగా పరిశీలించారు. ఆయన ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి శ్రీనగర్‌లో నివాళులు అర్పించారు. తర్వాత బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వివరాలు 

కశ్మీర్ పత్రికల వినూత్న నిరసన 

ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పత్రికలు ప్రత్యేక నిరసన తెలిపాయి. 'గ్రేట్ కశ్మీర్', 'రైజింగ్ కశ్మీర్', 'కశ్మీర్ ఉజ్మా', 'అఫ్తాబ్', 'తైమీల్ ఇర్షద్' వంటి ప్రముఖ పత్రికలు తమ సంప్రదాయ డిజైన్‌ను ప్రచురించకుండా నల్ల రంగుతో తమ మొదటి పేజీలను ముద్రించాయి. పేపర్ల ఫ్రంట్‌పేజ్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం నల్లగా ఉండగా, శీర్షికలు, సంపాదకీయాలు తెలుపు, ఎరుపు రంగులో ప్రింట్ అయ్యాయి. ఈ దాడికి నిరసనగా పిలుపునిచ్చిన బంద్‌కు అన్ని వర్గాల నుంచి విశేష మద్దతు లభించింది. కశ్మీర్ లోయలో గత 35 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత స్థాయిలో బంద్‌కు మద్దతు లభించిందని అధికారులు తెలిపారు. ప్రజలు, వ్యాపారవేత్తలు, పత్రికలు.. అన్నీ ఒకే గళంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ అభిమతాన్ని తెలియజేశారు.