NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Terror Attack: రూ.10 లక్షల పరిహారం.. బ్లాక్‌ కలర్‌లో కశ్మీర్ పత్రికల ఫ్రంట్‌ పేజ్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Terror Attack: రూ.10 లక్షల పరిహారం.. బ్లాక్‌ కలర్‌లో కశ్మీర్ పత్రికల ఫ్రంట్‌ పేజ్‌
    రూ.10 లక్షల పరిహారం.. బ్లాక్‌ కలర్‌లో కశ్మీర్ పత్రికల ఫ్రంట్‌ పేజ్‌

    Terror Attack: రూ.10 లక్షల పరిహారం.. బ్లాక్‌ కలర్‌లో కశ్మీర్ పత్రికల ఫ్రంట్‌ పేజ్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 23, 2025
    01:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది.

    పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన ఈ దాడి తీవ్రంగా హిందూపై ప్రభావం చూపించింది.

    ఈ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది.

    మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

    అంతేగాక, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు.

    వివరాలు 

    ఘటన స్థలాన్ని సందర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా 

    మంగళవారం జరిగిన ఈ దాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనంత్‌నాగ్‌కు చేరుకున్నారు.

    కాల్పులు జరిగిన ప్రదేశాన్ని దగ్గరగా పరిశీలించారు. ఆయన ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి శ్రీనగర్‌లో నివాళులు అర్పించారు.

    తర్వాత బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

    వివరాలు 

    కశ్మీర్ పత్రికల వినూత్న నిరసన 

    ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పత్రికలు ప్రత్యేక నిరసన తెలిపాయి.

    'గ్రేట్ కశ్మీర్', 'రైజింగ్ కశ్మీర్', 'కశ్మీర్ ఉజ్మా', 'అఫ్తాబ్', 'తైమీల్ ఇర్షద్' వంటి ప్రముఖ పత్రికలు తమ సంప్రదాయ డిజైన్‌ను ప్రచురించకుండా నల్ల రంగుతో తమ మొదటి పేజీలను ముద్రించాయి.

    పేపర్ల ఫ్రంట్‌పేజ్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం నల్లగా ఉండగా, శీర్షికలు, సంపాదకీయాలు తెలుపు, ఎరుపు రంగులో ప్రింట్ అయ్యాయి.

    ఈ దాడికి నిరసనగా పిలుపునిచ్చిన బంద్‌కు అన్ని వర్గాల నుంచి విశేష మద్దతు లభించింది.

    కశ్మీర్ లోయలో గత 35 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత స్థాయిలో బంద్‌కు మద్దతు లభించిందని అధికారులు తెలిపారు.

    ప్రజలు, వ్యాపారవేత్తలు, పత్రికలు.. అన్నీ ఒకే గళంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ అభిమతాన్ని తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి మణిపూర్
    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    జమ్ముకశ్మీర్

    Z-Morh Tunnel: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జెడ్-మోడ్‌ ప్రారంభం నరేంద్ర మోదీ
    Z-Morh Tunnel : జెడ్-మోర్ సొరంగం.. కాశ్మీర్-లడఖ్ రవాణాకు కీలక మైలురాయి నరేంద్ర మోదీ
    Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దులో ల్యాండ్ మైన్ పేలుడు.. ఆరుగురు జవాన్లకు గాయాలు ఆర్మీ
    Mysterious deaths: రాజౌరీ జిల్లాలో అనుమానాస్పద రీతిలో మరణాలు.. విచారణకు సిట్ ఏర్పాటు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025