NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam Terror Attack: కశ్మీర్ టెర్రర్ ఎఫెక్ట్.. ఆరు గంటల్లో ఖాళీ అయిన హోటల్స్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Terror Attack: కశ్మీర్ టెర్రర్ ఎఫెక్ట్.. ఆరు గంటల్లో ఖాళీ అయిన హోటల్స్!
    కశ్మీర్ టెర్రర్ ఎఫెక్ట్.. ఆరు గంటల్లో ఖాళీ అయిన హోటల్స్!

    Pahalgam Terror Attack: కశ్మీర్ టెర్రర్ ఎఫెక్ట్.. ఆరు గంటల్లో ఖాళీ అయిన హోటల్స్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 23, 2025
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి భయభ్రాంతులకు గురిచేసింది.

    ఈ ఘటనతో వణికిపోయిన పర్యటకులు వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు సొంత ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు.

    కేవలం 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది శ్రీనగర్‌ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.

    Details

    పర్యాటకులకు అండగా నిలవాలి

    ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్‌ నుంచి పర్యటకుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. విమానాశ్రయంలో రద్దీ దృష్ట్యా ప్రత్యేక సదుపాయాలు కల్పించాం.

    ఆహారం, నీరు అందించాం. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు నుంచి 20 విమానాలు వెళ్లాయి.

    3,337 మంది పర్యటకులు ఈ ప్రాంతాన్ని వీడారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమానాలు అందుబాటులో ఉంచాం. టికెట్ ధరలు పెంచొద్దని విమానయాన సంస్థలను ఆదేశించాం.

    ఇప్పటికే అన్ని ఎయిర్‌లైన్లు టికెట్‌ క్యాన్సిలేషన్‌, రీషెడ్యూల్‌ ఛార్జీలను రద్దు చేశాయి.

    ఈ విపత్కర పరిస్థితుల్లో మనమంతా పర్యటకులకు అండగా నిలవాలని కేంద్రమంత్రి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

    Details

    పర్యటకులు వీడుతుంటే బాధగా ఉంది: ఒమర్‌ అబ్దుల్లా

    మరోవైపు తాజా పరిణామాలపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు.

    కశ్మీర్‌ లోయ నుంచి అతిథులు వీడుతుంటే నా హృదయం ద్రవిస్తోంది. అయితే వారు ఎందుకు వెళ్లిపోవాలనుకుంటున్నారనేది నేను అర్థం చేసుకోగలను.

    పర్యటకుల తిరుగు ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రం కల్పించిన అదనపు విమానాలతో పాటు రోడ్డు మార్గంలోనూ ప్రయాణ సౌకర్యాలు కల్పించామని సీఎం వెల్లడించారు.

    కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

    ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. మృతుల కుటుంబాలకు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    ఇండియా

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    జమ్ముకశ్మీర్

    Mysterious deaths: రాజౌరీ జిల్లాలో అనుమానాస్పద రీతిలో మరణాలు.. విచారణకు సిట్ ఏర్పాటు  భారతదేశం
    Amit Shah : జమ్ముకశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి అమిత్‌ షా కీలక అదేశాలు అమిత్ షా
    Rajouri: చిక్కుముడి వీడిన అంతుచిక్కని వ్యాధి.. క్వారంటైన్‌లో గ్రామం భారతదేశం
    Rajouri: రాజౌరిలో మిస్టరీ మరణాలు.. బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు కారణం కాదన్న కేంద్రమంత్రి.. భారతదేశం

    ఇండియా

    Hyderabad Metro: హైదరాబాద్‌లో అర్ధరాత్రి 12 వరకు మెట్రో సేవలు.. ఆలస్యంగా వెళ్లేవారికి తీపి కబురు!  హైదరాబాద్
    Swami Nithyananda: స్వామి నిత్యానంద బ్రతికే ఉన్నారు... కైలాస దేశం అధికారిక ప్రకటన!  స్వామి నిత్యానంద
    Telangana: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. పేదలకు నిత్యావరస సరుకుల కిట్ తెలంగాణ
    Microsoft Turns 50 : MS-DOS నుంచి AI వరకూ.. 50 ఏళ్ల మైక్రోసాఫ్ట్‌ ప్రయాణం ఓ అధ్యాయమే! మైక్రోసాఫ్ట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025