KCR Discharge : యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. నందినగర్ ఇంటికి చేరిన గులాబీ దళపతి
యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. సర్జరీ అనంతరం కోలుకున్న కేసీఆర్ను వైద్య బృందం ఇవాళ డిశ్చార్జ్ చేసేశారు. దీంతో ఆయన బంజారాహిల్స్'లోని నందినగర్ నివాసానికి వెళ్లారు. ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసి పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆస్పత్రికి భారీగా చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ను ప్రత్యేక వాహనంలో నందినగర్లోని నివాసానికి తీసుకెళ్లారు. కేసీఆర్ వాహనంలో కేటీఆర్, హరీశ్ రావులు ఉన్నారు. వీల్చైర్లో వాహనం వరకు వచ్చిన కేసీఆర్ తన నివాసానికి తరలివెళ్లారు. డిసెంబర్ 7న తన వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి పడగా, డిసెంబర్ 8న ఆయనకు తుంటి ఎముక సర్జరి జరిగింది. అనంతరం కోలుకున్న కేసీఆర్ను ఇవాళ డిశ్చార్జ్ చేశారు.
నందినగర్ ఇంటికి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్
#WATCH | Former CM of Telangana and BRS party leader KCR reaches his residence in Hyderabad after being discharged from hospital following hip replacement surgery. KCR underwent a total left hip replacement surgery after he fell in his farmhouse in Erravalli, on December 7. pic.twitter.com/6tAJIK2uAz— ANI (@ANI) December 15, 2023