NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేరళలో మైకుపై కేసు నమోదు.. సీఎం ప్రసంగంలో మొరయించిందని పరికరం స్వాధీనం
    తదుపరి వార్తా కథనం
    కేరళలో మైకుపై కేసు నమోదు.. సీఎం ప్రసంగంలో మొరయించిందని పరికరం స్వాధీనం
    కేరళలో మైకు గోల.. సీఎం ప్రసంగం సందర్భంగా పనిచేయని మైక్, కేసు నమోదు

    కేరళలో మైకుపై కేసు నమోదు.. సీఎం ప్రసంగంలో మొరయించిందని పరికరం స్వాధీనం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 27, 2023
    12:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళ సీఎం పినరయి విజయన్‌ సభలో 'మైక్‌' కాసేపు పనిచేయని ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయం దుమారం రేపుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.

    మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ జులై 18న మరణించారు. ఆయన సంస్మరణ సభను సోమవారం తిరువనంతపురంలోని అయ్యంకాళి హాల్‌లో కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (KPCC) ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం పినరయి ప్రసంగాన్ని ప్రారంభించారు.

    ఇదే సమయంలో స్వల్ప వ్యవధిలో పెద్ద శబ్దంతో మైక్‌ మొరాయించింది. దీనిపై కంటోన్మెంట్‌ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా మైక్‌ ఆపరేటర్‌ నుంచి వాంగ్మూలం తీసుకుని మైక్‌ సహా యాంప్లీఫైర్‌(AMPLIFER)ను స్వాధీనం చేసుకున్నారు.

    details

    బుధవారం కేసును మూసేసినట్లు ప్రకటించిన పోలీసులు

    ఈ నేపథ్యంలో స్పందించిన కాంగ్రెస్‌, మైక్ మొరాయిస్తే స్వాధీనం చేసుకోవడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలో ప్రసంగానికి కాసేపు అంతరాయం కలిగినందుకే మైక్‌ పైనే కేసు పెడతారా అంటూ మండిపడింది.

    మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. మైకులో ఏర్పడిన సాంకేతిక సమస్యలను తెలుసుకునేందుకే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

    పోలీసుల అత్యుత్సాహంపై ఆశ్చర్యానికి గురిచేసిందని మైకు ఆపరేటర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌, రాహుల్‌ గాంధీ సభలకూ తానే మైకులను ఏర్పాటు చేసినా, ఎప్పుడూ ఎటువంటి సమస్యలు రాలేదన్నాడు. ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లోనూ పోలీసుల తీరుకు కౌంటర్లు ఇస్తున్నారు. మరోవైపు ఈ కేసును బుధవారమే మూసేసినట్లు పోలీసులు తాజాగా ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    ముఖ్యమంత్రి
    పినరయి విజయన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కేరళ

    బిడ్డకు జన్మనిచ్చిన జహాద్, దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులైన టాన్స్‌జెండర్ జంట భారతదేశం
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు ఎన్ఐఏ
    చిన్నారి వైద్యం కోసం పేరు చెప్పకుండా రూ.11కోట్లు విరాళంగా ఇచ్చిన దాత ముంబై
    రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ తిరువనంతపురం

    ముఖ్యమంత్రి

    వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్‌దే  ప్రభుత్వం, దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తాం:కేసీఆర్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్
    'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ

    పినరయి విజయన్

    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025