NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kerala Floods: కేరళకు ఏడు రోజుల ముందే హెచ్చరించాం : అమిత్ షా
    తదుపరి వార్తా కథనం
    Kerala Floods: కేరళకు ఏడు రోజుల ముందే హెచ్చరించాం : అమిత్ షా
    కేరళకు ఏడు రోజుల ముందే హెచ్చరించాం : అమిత్ షా

    Kerala Floods: కేరళకు ఏడు రోజుల ముందే హెచ్చరించాం : అమిత్ షా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 31, 2024
    06:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని కేరళకు ఏడు రోజులు ముందే హెచ్చరికలు జారీ చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కన్నారు.

    హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

    బుధవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు. మొదటగా వాయనాడ్ కొండచరియలు విరిగిపడి మృతి చెందిన కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు.

    ఈ ముప్పు గురించి జూలై 23న అప్రమత్తం చేశామని, భారీ వర్షాలు కురవగానే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆ రాష్ట్రానికి పంపామని ఆయన వెల్లడించారు.

    Details

    మోదీ ప్రభుత్వం అండగా ఉంటుంది

    ప్రకృతి వైపరీత్యాల గురించి ఏడు రోజుల ముందే చెప్పే వ్యవస్థ భారత్ లో ఉంది. ఇటువంటి సాంకేతికత ఉన్న నాలుగు దేశాల్లో భారత్ కూడా ఒకటి.

    ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని ఉంటే ప్రాణనష్టం తగ్గేది.

    వయనాడ్ విషాదాన్ని ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వంతో పాటు మోదీ ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని అమిత్ షా వివరించారు.

    కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటికే మృతుల సంఖ్య 184కి చేరుకుంది. 225 మంది గల్లంతయ్యారు. సుమారు 7,000 మందిని 50 సహాయక శిబిరాల్లో ఉంచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    కేరళ

    తాజా

    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్

    అమిత్ షా

    రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికలపై కమలదళపతుల నజర్​.. అర్థరాత్రి 2 వరకు షా, నడ్డా వ్యూహాత్మక చర్చలు రాజస్థాన్
    నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ   తెలంగాణ
    బీఆర్ఎస్ సర్కారుపై అమిత్ షా చురకలు.. కేసీఆర్ కారు, ఒవైసీ స్టీరింగ్ అంటూ.. బీజేపీ
    అమృత్ కాల్‌ను విజయవంతం చేయాలి, ఐపీఎస్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో అమిత్‌ షా హైదరాబాద్

    కేరళ

    Covid-19 : కేరళలో కొత్తగా 265 కొవిడ్ కేసులు.. 80శాతం యాక్టివ్ కేసులు ఇక్కడే కొవిడ్
    Sabarimala Temple: మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం.. భారీగా తరలివచ్చిన భక్తులు  శబరిమల
    Kerala Governor: ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయకపోవడంపై.. రోడ్డుపై కేరళ గవర్నర్ నిరసన  తాజా వార్తలు
    Kerala: కేరళ బీజేపీ నేత హత్య.. పీఎఫ్‌ఐకి చెందిన 15 మందికి మరణశిక్ష  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025