NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ 
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయమంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ

    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Jun 01, 2023
    05:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ 'ప్రచండ' భారత పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రచండ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

    ఇంధనం, కనెక్టివిటీ, వాణిజ్యంతో సహా పలు రంగాల్లో భారతదేశం-నేపాల్ దేశాల మధ్య సహకారం మరింత బలపడే విధంగా ఇద్దరు ప్రధానులు విస్తృత చర్చలు జరిపారు.

    సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్-నేపాల్ సంబంధాలను హిమాలయ శిఖరాల ఎత్తులకు తీసుకెళ్లేందుకు తాము నిరంతరం కృషి చేస్తామన్నారు.

    భవిష్యత్తులో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని సూపర్‌హిట్‌గా మార్చేందుకు ప్రచండ, తాను ఈరోజు చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు మోదీ చెప్పారు.

    నేపాల్

    ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ప్రచండ చేపట్టిన మొదటి విదేశీ పర్యటన ఇదే

    నేపాల్ ప్రధాని తన నాలుగు రోజుల భారత పర్యటన నిమిత్తం బుధవారం దిల్లీకి చేరుకున్నారు.

    కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్ట్ నాయకుడు ప్రచండ 2022లో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత చేస్తున్న మొదటి ద్వైపాక్షిక విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.

    ఆసియాలో ప్రాంతంలో వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా భారతదేశానికి నేపాల్ చాలా ముఖ్యమైన భాగస్వామి.

    రెండు దేశాల ప్రజల మధ్య సరిహద్దు వివాహాలు నేపాల్- భారత్ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తాయి.

    సిక్కిం, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ దాదాపు 1,850 కి.మీ పైగా సరిహద్దును పంచుకుంటుంది.

    1950 నాటి భారత్-నేపాల్ శాంతి, స్నేహ ఒప్పందం రెండు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాలకు పునాదిగా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    నేపాల్
    భారతదేశం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం  ఆంధ్రప్రదేశ్
    91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్ కర్ణాటక
    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం మన్ కీ బాత్

    ప్రధాన మంత్రి

    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  మన్ కీ బాత్
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  నరేంద్ర మోదీ
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  నరేంద్ర మోదీ

    నేపాల్

    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం విమానం
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! విమానం
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం విమానం
    ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా? జీవనశైలి

    భారతదేశం

    మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు పాకిస్థాన్
    'జాతీయ సివిల్ సర్వీసెస్ డే 2023'ను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యతను తెలుసుకోండి  కలెక్టర్
    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  సూడాన్
    దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు  కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025