NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Survey on Work From Home: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వర్క్‌ ఫ్రమ్‌ హోంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే
    తదుపరి వార్తా కథనం
    Survey on Work From Home: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వర్క్‌ ఫ్రమ్‌ హోంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే
    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వర్క్‌ ఫ్రమ్‌ హోంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే

    Survey on Work From Home: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వర్క్‌ ఫ్రమ్‌ హోంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 26, 2025
    01:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌ను ప్రోత్సహించే దిశగా కీలక అడుగు వేసింది.

    ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించి ప్రత్యేక సర్వే నిర్వహించనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా మార్చి 10 వరకు ఈ సర్వే కొనసాగనుంది.

    ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న వారి వివరాలను సేకరించనుంది. ఈ సర్వే ద్వారా టెక్నికల్ స్కిల్స్, విద్యార్హతలు, ప్రస్తుతం వారు చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం పొందనుంది.

    ఈ డేటాను విశ్లేషించి, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆసక్తి ఉన్నవారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

    Details

    వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్ల ఏర్పాటుపై ఆసక్తి

    అవసరమైతే ప్రత్యేక వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశంపై కూడా పరిశీలిస్తోంది.

    అందుకు అవసరమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, హై-స్పీడ్ ఇంటర్నెట్, తగిన వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.

    కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ పెరిగింది. వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వెళ్లి మిగతా రోజులు ఇంటి నుంచే పని చేసే సంస్కృతి పలు సంస్థల్లో కొనసాగుతోంది.

    ఏపీ ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారించడంతో పెట్టుబడిదారులను ఆకర్షించే చర్యలు తీసుకుంటోంది.

    ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహిస్తూ, అందులో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అర్థం చేసుకునేందుకు ఈ సర్వేను చేపట్టింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    Manipur violence: మణిపూర్‌ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ! మణిపూర్
    Vatican City: ప్రపంచంలో విరాళాలతో నిలిచే ప్రపంచపు మినీ దేశం.. అది ఎక్కడుందో తెలుసా? ప్రపంచం
    Rinku Singh: వైభవంగా భారత క్రికెటర్‌ రింకు సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం రింకూ సింగ్
    Singireddy Narayana Reddy: పాటలలో పరవశించిన కవి.. తెలుగు గేయానికి తాళం చెక్కిన తాత్వికుడు 'సినారే'! టాలీవుడ్

    ఆంధ్రప్రదేశ్

    SVAMITVA scheme: స్వమిత్వ పథకం పనులకు నూతన ఊపు.. మళ్లీ ప్రారంభమైన సర్వేలు  వైసీపీ
    'Dhar Gang': దక్షిణాదిని గడగడలాడించిన 'ధార్‌ గ్యాంగ్‌' అరెస్టు మధ్యప్రదేశ్
    Andhra Pradesh: రూ.17,000 కోట్లతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌! భారతదేశం
    Talliki Vandanam: తల్లికి వందనం పథకం అమలు పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. విధి విధానాలు ఇవే..! భారతదేశం

    ప్రభుత్వం

    Runa Mafi: రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. రేపటి నుండి కొత్త యాప్ ద్వారా వారి వివరాలు సేకరణ తుమ్మల నాగేశ్వరరావు
    Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. సచివాలయ వ్యవస్థలో సంస్కరణల పునఃప్రారంభం.. రివర్స్ టెండరింగ్స్ రద్దు చంద్రబాబు నాయుడు
    Japan: సంచలన నిర్ణయం.. ఇక వారానికి నాలుగు రోజులే పని..ఎక్కడంటే?  జపాన్
    Telangana: భారీ వర్షాలు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025