Page Loader
Ravneet Singh Bittu: 'ఖలిస్తానీ శక్తులు నా హత్యకు ప్రణాళిక వేస్తున్నాయి': కేంద్ర మంత్రి
'ఖలిస్తానీ శక్తులు నా హత్యకు ప్రణాళిక వేస్తున్నాయి': కేంద్ర మంత్రి

Ravneet Singh Bittu: 'ఖలిస్తానీ శక్తులు నా హత్యకు ప్రణాళిక వేస్తున్నాయి': కేంద్ర మంత్రి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2025
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

రైల్వే శాఖ సహాయమంత్రి రవనీత్ సింగ్ బిట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వారిస్ పంజాబ్ దే' అనే సంస్థతో సంబంధాలు కలిగిన ఖలిస్థాన్ పక్షపాతులు తనను హత్య చేయాలనే కుట్రలో పాల్గొంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సంస్థను రాడికల్ భావజాల ప్రచారకుడు, ఎంపీ అయిన అమృత్‌పాల్ సింగ్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. తనతో పాటు పంజాబ్‌లోని మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రాణాలకు కూడా ఖలిస్థానీ మద్దతుదారుల నుంచి ప్రమాదం పొంచి ఉందని బిట్టు వెల్లడించారు.

వివరాలు 

కుట్రకు సంబంధించిన ఆధారాలు

ఈ కుట్రకు సంబంధించిన ఆధారాలు సోషల్ మీడియాలో లీకైన స్క్రీన్‌షాట్ల రూపంలో తనకు తెలిసినట్లు ఆయన తెలిపారు. జాతీయ భద్రతా చట్టం ప్రకారం అమృత్‌పాల్‌ నిర్బంధాన్ని ఏడాది పాటు పొడిగించిన నేపథ్యంలో, 'వారిస్ పంజాబ్ దే' నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా ద్వేషంతో ఉన్నారని బిట్టు ఆరోపించారు. ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం చాలా గంభీరంగా తీసుకుంటున్నదని ఆయన స్పష్టంచేశారు.