Gurpatwant Singh Pannun: ఆమ్ ఆద్మీ పార్టీ పై ఖలిస్తానీ నేత తీవ్ర ఆరోపణలు
ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆప్ పార్టీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తానీ గ్రూపులు భారీ ఆర్థిక సాయాన్ని అందించినట్లు చెప్పారు. 2014 నుంచి 2022 వరకు ఖలిస్తానీ గ్రూపులు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి సుమారు రూ.133.54 కోట్లతో ఆర్థిక సాయం అందించాయని పన్నూన్ ఆరోపించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిధులకు బదులుగా దేవీందర్ పాల్ సింగ్ భుల్లర్ను విడుదల చేయడానికి హామీ ఇచ్చారని పన్నూన్ పేర్కొన్నాడు. 1993 ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో భుల్లర్ దోషి. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మరణించగా, 31 మంది గాయపడ్డారు.