NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: 22 శాతం పూర్తయిన ఖరీఫ్‌ సీఎంఆర్‌.. 7.90 లక్షల టన్నుల బియ్యం సిద్ధం
    తదుపరి వార్తా కథనం
    Telangana: 22 శాతం పూర్తయిన ఖరీఫ్‌ సీఎంఆర్‌.. 7.90 లక్షల టన్నుల బియ్యం సిద్ధం
    22 శాతం పూర్తయిన ఖరీఫ్‌ సీఎంఆర్‌.. 7.90 లక్షల టన్నుల బియ్యం సిద్ధం

    Telangana: 22 శాతం పూర్తయిన ఖరీఫ్‌ సీఎంఆర్‌.. 7.90 లక్షల టన్నుల బియ్యం సిద్ధం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 25, 2025
    02:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్‌ (సీఎంఆర్‌) ద్వారా బియ్యంగా మారుతోంది.

    మిల్లులకు కేటాయించిన వడ్ల సీఎంఆర్‌ ఫిబ్రవరి 20 నాటికి 22 శాతం పూర్తి కాగా, 7.90 లక్షల టన్నుల బియ్యం సిద్ధమైంది.

    ఇందులో 5.37 లక్షల టన్నుల బియ్యం సన్న రకానికి చెందినదిగా, మిగతా భాగం దొడ్డు రకంగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

    వివరాలు 

    తొలిసారి వేర్వేరుగా మిల్లింగ్ 

    ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వం రైతుల నుంచి 53.95 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

    జనవరి రెండో వారానికి ఈ ప్రక్రియ ముగిసింది. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపగా, అక్కడ మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

    గత అనుభవాలతో పోల్చితే, ఈసారి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్న రకం వడ్లే ఎక్కువగా వచ్చాయి.

    అందుకే, ఈ ఏడాది సన్న మరియు దొడ్డు వడ్లను వేర్వేరు నిల్వ చేసి, విడివిడిగా మిల్లింగ్ చేస్తున్నారు.

    సన్న, దొడ్డు వడ్లను ప్రత్యేకంగా మిల్లింగ్ చేయడం ఇదే మొదటిసారి. మిల్లింగ్ ప్రక్రియలో ప్రాధాన్యత సన్న ధాన్యానికే ఇస్తున్నారు.

    రేషన్‌కార్డుదారులకు పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని తీసుకుంటుండగా, దొడ్డు బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు కేటాయిస్తున్నారు.

    వివరాలు  

    పెద్దపల్లిలో వేగంగా మిల్లింగ్ 

    జిల్లాల వారీగా సీఎంఆర్‌ పురోగతిని పరిశీలిస్తే, పెద్దపల్లి జిల్లా 51 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసింది.

    భద్రాద్రి కొత్తగూడెం 48 శాతం, మహబూబాబాద్‌ 38 శాతం, ఖమ్మం 37 శాతం, నల్గొండ 33 శాతం, నిజామాబాద్‌ 26 శాతం సీఎంఆర్‌ ప్రాసెస్‌ను పూర్తిచేశాయి.

    కానీ, సూర్యాపేట జిల్లాలో కేవలం 10 శాతం, కామారెడ్డిలో 8 శాతం, సంగారెడ్డిలో 7 శాతం, నిర్మల్‌లో 6 శాతం, వికారాబాద్‌ జిల్లాలో 5 శాతం మాత్రమే పూర్తయింది. ధాన్యం సేకరణ అధికంగా జరిగిన జిల్లాల్లో కామారెడ్డి ముఖ్యమైనది.

    అక్కడ మొత్తం 4,31,581 టన్నుల ధాన్యం సేకరించగా, 2,89,159 టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. అయితే, ఫిబ్రవరి 22 నాటికి కేవలం 23,509 టన్నుల బియ్యం మాత్రమే సమకూరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    తెలంగాణ

     TG Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు నిధులు జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు భారతదేశం
    TPCC: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ కాంగ్రెస్
    Kishan Reddy: ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి : కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి
    Double bedroom: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కొత్త ప్రణాళిక ..! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025