NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kolkata: మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా.. కొనసాగుతున్న సమ్మె  
    తదుపరి వార్తా కథనం
    Kolkata: మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా.. కొనసాగుతున్న సమ్మె  
    Kolkata: మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా.. కొనసాగుతున్న సమ్మె

    Kolkata: మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా.. కొనసాగుతున్న సమ్మె  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 12, 2024
    10:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, ఆపై హత్య చేయడంపై కలకలం రేగుతోంది.

    మరోవైపు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు.

    తమ సహోద్యోగిని హత్య చేసినప్పటి నుండి రెసిడెంట్ వైద్యులు నిరసనలు చేస్తున్నారు.

    ఈ సమయంలో ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. దీంతో ఆయనపై ఒత్తిడి పెరిగి ఈరోజు రాజీనామా చేశారు.

    రాజీనామా ప్రకటన తర్వాత, సందీప్ ఘోష్ మీడియాతో మాట్లాడారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రిన్సిపాల్ రాజీనామా

    #BreakingNews: Principal of RG Kar medical college, Sandip Ghosh, resigns from the position amidst the ongoing investigation. @KamalikaSengupt shares more with @anjalipandey06 | #WestBengal #Doctor #RGKarMedicalCollege pic.twitter.com/GTKqmOnZf4

    — News18 (@CNNnews18) August 12, 2024

    వివరాలు 

    మహిళా డాక్టర్‌పై అత్యాచారం-హత్య -సమ్మె 

    "సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. నా గురించి ఏదేదో మాట్లాడుతున్నారు.. చనిపోయిన డాక్టర్ నా కూతురే.. ఒక పేరెంట్‌గా రాజీనామా చేయడం సరైనదని భావిస్తున్నా.. ఇకపై ఎవరికీ ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను" అని అన్నారు.

    కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    శుక్రవారం నుండి నిరసన కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రెసిడెంట్ వైద్యులు సమ్మెను ప్రకటించారు.

    మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు వైద్యులు సమ్మెకు దిగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    జూనియర్ డాక్టర్లు, ట్రైనీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ల సమ్మె సోమవారం వరుసగా నాలుగో రోజు కొనసాగడంతో ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి.

    వివరాలు 

    అసలు ఏమి జరిగింది ? 

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా డాక్టర్ శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

    ఆ తర్వాత ఓ ఆసుపత్రి వాలంటీర్ మద్యం మత్తులో ఆమెపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. రాత్రి భోజనం చేసి విశ్రాంతి తీసుకునేందుకు మహిళ ఇక్కడికి వచ్చింది.

    హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లాడు. అయితే, ఈ సమయంలో అతని బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు అక్కడే ఉండిపోయాయి.

    శుక్రవారం సెమినార్ హాలులో మహిళా వైద్యురాలి మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది.

    ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించగా,శనివారం (ఆగస్టు 10) సాయంత్రానికి నిందితుడిని అరెస్టు చేశారు.

    అయితే,అప్పటికి వైద్యులు నిరసనకు దిగారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కోల్‌కతా

    ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం పశ్చిమ బెంగాల్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి పశ్చిమ బెంగాల్
    దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025