NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vallabaneni Vamshi: వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదు 
    తదుపరి వార్తా కథనం
    Vallabaneni Vamshi: వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదు 

    Vallabaneni Vamshi: వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 26, 2025
    01:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది.

    ఆయనపై కేసుల ముప్పు మరింత తీవ్రతరమవుతోంది. అధికారంలో ఉన్న సమయంలో వంశీ పాల్పడిన భూదందాలు, అక్రమాలు, మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు వంశీపై తాజాగా మూడు కేసులు నమోదు చేశారు.

    ఆత్మకూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్లతో పాటు మరోసారి గన్నవరం పోలీస్ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది.

    ఆత్మకూరులో జరిగిన ఓ భూ వివాదంలో వంశీ అనుచరులు అతని సూచనల మేరకు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పోలీసులు తెలిపారు.

    ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినట్లు అయితే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని బెదిరింపులకు గురి చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

    వివరాలు 

    ఆత్మకూరు పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు

    దీనిపై స్పందించిన ఆత్మకూరు పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

    ఇక భూమి అక్రమంగా కబ్జా చేశారని ఓ న్యాయవాది మంగళవారం గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    అంతేకాదు, గన్నవరం నియోజకవర్గంలోని మర్లపాలెం మండలంలోని పానకాల చెరువులో అనధికారికంగా మైనింగ్ తవ్వకాలు నిర్వహించారని, దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

    దీనిపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    వివరాలు 

    వచ్చే నెల 11వ తేదీ వరకు రిమాండ్ పొడిగింపు 

    ఈ నెల 13వ తేదీన వంశీతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

    అనంతరం న్యాయస్థానంలో హాజరుపర్చగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించారు.

    రిమాండ్ గడువు ముగియడంతో, నిందితులను జైలు నుంచే వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

    వాదనలు విన్న న్యాయస్థానం వల్లభనేని వంశీతో పాటు మిగిలిన ఇద్దరు నిందితులకు వచ్చే నెల 11వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వల్లభనేని వంశీ

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    వల్లభనేని వంశీ

    టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు గన్నవరం
    Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీని వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు గన్నవరం
    Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు గన్నవరం
    Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025