NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Eknath Shinde: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై కమెడియన్‌ వివాస్పద వ్యాఖ్యలు.. కునాల్ కమ్రా‌ ఆఫీసుపై శివసేన కార్యకర్తల దాడి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Eknath Shinde: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై కమెడియన్‌ వివాస్పద వ్యాఖ్యలు.. కునాల్ కమ్రా‌ ఆఫీసుపై శివసేన కార్యకర్తల దాడి
    కునాల్ కమ్రా‌ ఆఫీసుపై శివసేన కార్యకర్తల దాడి

    Eknath Shinde: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై కమెడియన్‌ వివాస్పద వ్యాఖ్యలు.. కునాల్ కమ్రా‌ ఆఫీసుపై శివసేన కార్యకర్తల దాడి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 24, 2025
    08:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై హాస్యనటుడు కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనాన్ని రేపుతున్నాయి.

    షిండేను ఉద్దేశించి దేశద్రోహిగా అభివర్ణించిన కమ్రా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.

    షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు కునాల్ కమ్రా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.

    అంతేకాకుండా, కునాల్ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడులు కూడా చేశారు. కునాల్‌ను అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    కునాల్ స్వేచ్ఛగా తిరగలేడని హెచ్చరిక 

    శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని, అందుకే ఏక్‌నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకున్నారని లోక్‌సభ ఎంపీ నరేష్ మ్హాస్కే ఆరోపించారు.

    కునాల్‌ను "కాంట్రాక్ట్ కమెడియన్"గా అభివర్ణించిన మ్హాస్కే, అతను డబ్బుల కోసమే తమ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు.

    మహారాష్ట్రలోనే కాకుండా, దేశంలో ఎక్కడైనా కునాల్ స్వేచ్ఛగా తిరగలేడని హెచ్చరించారు. శివసేన కార్యకర్తలు అతన్ని నిరంతరం వెంబడిస్తారని గట్టి హెచ్చరికలు చేశారు.

    వివరాలు 

    శివసేన కార్యకర్తల హింసాత్మక చర్యలను ఖండించిన ఆదిత్య ఠాక్రే

    ఇక శివసేన కార్యకర్తల హింసాత్మక చర్యలను శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే తీవ్రంగా ఖండించారు.

    రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

    శివసేన కార్యకర్తలు సృష్టించిన విధ్వంస దృశ్యాలను శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

    మహారాష్ట్రకు ఒక బలహీనమైన హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారని విమర్శించారు.

    కునాల్ మహారాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్య పాట రాశారని, దానికి ప్రతిస్పందనగా షిండే అభిమానులు అతని ఆస్తులపై దాడులు చేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    మహారాష్ట్ర

    Eknath Shinde: ప్రజలు ఇచ్చిన మెజారిటీని ప్రతిపక్షాలు అంగీకరించాలి.. ఏక్‌నాథ్ షిండే  ఏక్‌నాథ్ షిండే
    Belagavi: మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దులోని బెళగావిపై మరోసారి వివాదం.. కర్ణాటక
    Cabinet Expansion: డిసెంబర్ 15న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులుగా 30 మంది! దేవేంద్ర ఫడణవీస్‌
    Mumbai Ferry boat: ట్రయల్ రన్ కి ఎవరు అనుమతి ఇచ్చారు? నేవీని ప్రశ్నించిన ముంబై పోలీసులు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025