NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / LK Advani: ఆదర్శ నేత అద్వానీ.. అవినీతి ఆరోపణలతో ఎంపీగా రాజీనామా.. క్లీన్‌చీట్ వచ్చాకే లో‌క్‌సభలో అడుగు 
    తదుపరి వార్తా కథనం
    LK Advani: ఆదర్శ నేత అద్వానీ.. అవినీతి ఆరోపణలతో ఎంపీగా రాజీనామా.. క్లీన్‌చీట్ వచ్చాకే లో‌క్‌సభలో అడుగు 
    L K Advani: ఆదర్శ నేత అద్వానీ.. అవినీతి ఆరోపణలతో ఎంపీగా రాజీనామా.. క్లీన్‌చీట్ వచ్చాకే లో‌క్‌సభలో అడుగు

    LK Advani: ఆదర్శ నేత అద్వానీ.. అవినీతి ఆరోపణలతో ఎంపీగా రాజీనామా.. క్లీన్‌చీట్ వచ్చాకే లో‌క్‌సభలో అడుగు 

    వ్రాసిన వారు Stalin
    Feb 03, 2024
    06:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించిన వేళ.. ఆయనకు సంబంధించిన పలు అంశాలను ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

    భారత సమాకాలిన రాజకీయాల్లో అద్వానీ లాంటి నాయకులు ఉండటం చాలా అరుదు.

    ఆధునిక పొలిటికల్ సిస్టమ్‌లో 'అవినీతి మరక' అనేది ఒక స్టేటస్‌గా భావిస్తున్న నేటి రాజకీయ నాయకులకు అద్వానీ ఆదర్శ జీవితం ఒక పాఠం అని చెప్పాలి.

    ఒకదశలో అద్వానీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రత్యర్థి పార్టీలకు ఆ ఆరోపణలు ఆయుధంగా మారాయి.

    కానీ ఆయన తన సచ్ఛీలతను నిరూపించుకునేందుకు పెద్ద సాహసమే చేశారు.

    తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, క్లీన్ చీట్ వచ్చే వరకు లోక్‌సభలోకి రాబోనని ప్రకటించి.. సంచలనానికి కేంద్ర బింధువు అయ్యారు.

    అద్వానీ

    హవాలా కేసులో అద్వానీపై సీబీఐ అభియోగాలు

    1993 నుంచి అద్వానీపై ఆరోపణలు మొదలయ్యాయి. హవాలా వ్యాపారి ఎస్కే జైన్ నుంచి లాల్ కృష్ణ అద్వానీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తన వద్ద ఆధారాలున్నాయని అప్పట్లో పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో ఉన్న సుబ్రమణ్యస్వామి విలేకరుల సమావేశంలో చెప్పారు.

    ఈ కేసును సీబీఐ విచారణకు స్వీకరించింది. ఎస్కే జైన్ డైరీని సీబీఐ స్వాధీనం చేసుకొని.. పరిశీలించగా.. అందులో 55 మంది నేతలు, 15 మంది అధికారులు, ఇతరత్రా 92 మంది పేర్లు బయటపడ్డాయి.

    ఈ హవాలా కేసులో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, శరద్ యాదవ్, విద్యా చరణ్ శుక్లా, ఎల్‌కే అద్వానీ పేర్లు కూడా ఉన్నాయి.

    లాల్ కృష్ణ అద్వానీ రూ.60 లక్షలు తీసుకున్నారని సీబీఐ అభియోగాలు మోపింది.

    అద్వానీ

    ఇచ్చిన మాట ప్రకారం.. 1996 ఎన్నికల్లో పోటీ చేయని అద్వానీ 

    1995లో ఎస్‌కే జైన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. 1996 జనవరి 16న సీబీఐ కేసు చార్జిషీటు దాఖలు చేసింది. అందులో ఎల్‌కే అద్వానీ పేరు కూడా ఉంది.

    1996లో సార్వత్రిక ఎన్నికల సమయంలోనే సీబీఐ చార్జిషీటు దాఖలు చేయడంతో ప్రత్యర్థి పార్టీలకు ఇది ఆయుధంగా మారింది.

    దీంతో అద్వానీ వెంటనే తన లోక్‌సభకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

    కానీ, అటల్ బిహారీ వాజ్‌పేయికి మాత్రం అద్వానీ రాజీనామా చేయడం ఇష్టం లేదు. కానీ అద్వానీ వినలేదు.

    తనపై అవినీతి ఆరోపణల నుంచి బయటపడేంత వరకు సభలోకి అడుగు పెట్టబోనని రాజీనామా చేస్తూనే అద్వానీ ప్రకటించారు. ఈ క్రమంలోనే 1996 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు.

    అద్వానీ

    1997లో క్లీన్ చీట్.. 3లక్షల మెజార్టీతో విజయం 

    8 ఏప్రిల్ 1997న హైకోర్టు తన తీర్పును వెలువరించింది. ఎల్‌కె అద్వానీని నిర్దోషిగా ప్రకటించింది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో అద్వానీని నిర్దోషిగా తేల్చింది.

    ఆ తర్వాత 1998లో గాంధీనగర్ నుంచి అద్వానీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఏకంగా 3లక్షల మెజార్టీతో గెలిచి.. విజయగర్వంతో అవినీతి మరకను తొలగించుకొని.. లోక్‌సభలో సగర్వంగా అడుగుపెట్టారు.

    ఈ ఘటన అద్వానీ నిజాయితీకి అద్దం పడుతుంది. ఈ ఉదంతం దేశ ప్రజల పట్ల, రాజకీయాల పట్ల ఆయనకున్న కమిట్మెంట్‌కు ఒక నిదర్శనం అని చెప్పాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    భారతరత్న
    తాజా వార్తలు
    లోక్‌సభ

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    బీజేపీ

    BRS: బీఆర్ఎస్‌లో చేరిన  ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌ కుమారుడు బీఆర్ఎస్
    Manda Krishna : బీజేపీకి బిగ్ బూస్ట్.. కమలాన్ని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులకు మందకృష్ణ మాదిగ లేఖ భారతదేశం
    Pawan Kalyan: నేటి నుంచి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ వివరాలు ఇవీ..  పవన్ కళ్యాణ్
    Telangana Elections: తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులపై భారీగా క్రిమినల్ కేసులు.. నేరచరిత్రలో ఏ పార్టీ టాప్?  తెలంగాణ

    భారతరత్న

    Bharat Ratna : అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి 70 ఏళ్లు.. ప్రారంభించింది ఎవరో తెలుసా లైఫ్-స్టైల్
    Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న' బిహార్
    Bharat Ratna: 'భారతరత్న' అవార్డును ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా?  బీజేపీ
     LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి 'భారతరత్న' నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    Bihar politics: ఎన్డీఏలో చేరిన తర్వాత.. ఆర్జేడీపై నితీష్ కుమార్ మొదటి వేటు నితీష్ కుమార్
    China: చైనా, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం: జిన్ పింగ్  చైనా
    Plane Crash: కుప్పకూలిన మినీ విమానం.. ఏడుగురు మృతి బ్రెజిల్
    IND vs ENG: షాకింగ్ న్యూస్.. రెండో టెస్టులో జడేజా ఆడటం అనుమానమే!  టీమిండియా

    లోక్‌సభ

    TMC ఎంపీ మహువా మొయిత్రాపై ఆరోపణలు.. ఎథిక్స్ కమిటీ పరిశీలనకు పంపించిన స్పీకర్ ఓంబిర్లా  ఓం బిర్లా
    టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా లంచాల ఆరోపణల వెనుక ఉన్నది మాజీ సన్నిహితుడేనా? ఓం బిర్లా
    Mahua Moitra: బీజేపీ ఎంపీ,సుప్రీంకోర్టు న్యాయవాదిపై పరువు నష్టం దావా వేసిన మహువా మొయిత్రా  భారతదేశం
    మహువా మొయిత్రా కేసులో అనూహ్యం.. కేసు నుంచి తప్పుకున్న లాయర్, అక్టోబర్ 31న విచారణ  మహువా మోయిత్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025