NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court : న్యాయవ్యవస్థ పరువు తీసేలా రాజకీయ ఎజెండా... సీజేఐకి 600 మంది న్యాయవాదుల సంచలన లేఖ..!
    తదుపరి వార్తా కథనం
    Supreme Court : న్యాయవ్యవస్థ పరువు తీసేలా రాజకీయ ఎజెండా... సీజేఐకి 600 మంది న్యాయవాదుల సంచలన లేఖ..!
    సీజేఐకి 600 మంది న్యాయవాదుల సంచలన లేఖ..!

    Supreme Court : న్యాయవ్యవస్థ పరువు తీసేలా రాజకీయ ఎజెండా... సీజేఐకి 600 మంది న్యాయవాదుల సంచలన లేఖ..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 28, 2024
    01:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసే రాజకీయ ఎజెండా అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాస్తూ న్యాయవాదుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

    రాజకీయ వ్యవహారాల్లో న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు,న్యాయవ్యవస్థపై ప్రభావం చూపేలా,కోర్టు ఆదేశాలను తిప్పికొట్టేందుకు అసంబద్ధ వాదనలు వినిపిస్తున్నాయని సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

    ఎజెండాను క్రమపద్ధతిలో నిర్వహిస్తున్నారని,ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు అని పేర్కొంది.

    సీజేఐ చంద్రచూడ్‌కు లేఖలు పంపిన 600 మంది లాయర్లలో హరీశ్ సాల్వే,బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మనన్ కుమార్ మిశ్రా,సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిష్ అగర్వాల్,పింకీ ఆనంద్,హితేష్ జైన్ వంటి ప్రముఖ న్యాయవాదులు కూడా ఉన్నారు.

    న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

    లేఖ 

    లేఖలో ఇంకా ఏం చెప్పారు? 

    ఏ రాజకీయ పార్టీ పేరు పెట్టకుండానే..ఎజెండాలో భాగంగా న్యాయవ్యవస్థ పరువు తీస్తున్నారని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

    న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేలా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

    రాజకీయంగా సున్నితమైన కేసుల్లో న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు,కోర్టుల పరువు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.

    ఇది మాత్రమే కాదు,న్యాయస్థానంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేందుకు న్యాయవ్యవస్థ ప్రస్తుత చర్యలు,గతం గురించి తప్పుడు కథనాన్నిసృష్టిస్తున్నారు.

    న్యాయమూర్తుల గౌరవంపై నేరుగా దాడి చేస్తూనే బెంచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలు కూడా కల్పితమని లేఖలో లాయర్లు పేర్కొన్నారు.

    కోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే బాగుంటుంది,వ్యతిరేకంగా ఇస్తే తప్పేమిటంటూ రాజకీయఎజెండాతో ఇలా వ్యూహరచన చేస్తున్నారన్నారు.

    రాజకీయ నాయకుడిపై అవినీతి ఆరోపణలు వస్తే కోర్టులోనే ప్రశ్నలు ఎదురవుతాయి.

    లేఖ 

    దాడులకు వ్యతిరేకంగా తగిన రక్షణ చర్యలు

    న్యాయవ్యవస్థ నియామకాలు,ఫలితాలను ప్రభావితం చేయడానికి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది.

    ఎన్నికల సమయంలో ఇటువంటి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.2018-19లో కూడా అదే జరిగింది.

    న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను పేర్కొంటూ ఈ దాడులకు వ్యతిరేకంగా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో న్యాయవాదులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

    ఈ దాడుల నుంచి మన కోర్టులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నామని న్యాయవాదులు తెలిపారు.

    Details 

     నాయకత్వమే ముఖ్యమని సీజేఐకి సూచించిన  న్యాయవాదులు 

    మౌనంగా ఉండటం లేదా ఏమీ చేయకుండా ఉండటం న్యాయవ్యవస్థకు హాని కలిగించాలనుకునే వారికి అనుకోకుండా మరింత శక్తిని అందించవచ్చు.

    అలాంటి ప్రయత్నాల పట్ల గౌరవప్రదంగా మౌనం వహించాల్సిన సమయం ఇది కాదు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది.

    ఈ కష్టకాలంలో మీ నాయకత్వమే ముఖ్యమని ఆ లేఖలో న్యాయవాదులు సీజేఐకి సూచించారు.

    ఈ సమస్యలపై మీరు మాకు మార్గనిర్దేశం చేస్తారని, మా న్యాయస్థానాలను పటిష్టంగా ఉంచుతారని మీపై, గౌరవనీయులైన న్యాయమూర్తులందరిపై మాకు నమ్మకం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డివై చంద్రచూడ్
    సుప్రీంకోర్టు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    డివై చంద్రచూడ్

    మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ సుప్రీంకోర్టు
    శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు శివసేన
    స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    సుప్రీంకోర్టు

    Ayodhya Ram Temple: అయోధ్య తీర్పు చెప్పిన ఐదుగురు జడ్జిలు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అయోధ్య
    Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు... గుజరాత్‌లో లొంగిపోయిన అందరు ఖైదీలు బిల్కిస్‌ బానో కేసు
    Loan Scam Case: వాధ్వాన్ సోదరుల బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు  కుంభకోణం
    chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025