NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rail Accident: జార్ఖండ్‌లోఘోర రైలు ప్రమాదం..రెండు గూడ్స్ రైళ్లు ఢీకొని  భారీ అగ్నిప్రమాదం.. లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!  
    తదుపరి వార్తా కథనం
    Rail Accident: జార్ఖండ్‌లోఘోర రైలు ప్రమాదం..రెండు గూడ్స్ రైళ్లు ఢీకొని  భారీ అగ్నిప్రమాదం.. లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!  
    జార్ఖండ్‌లోఘోర రైలు ప్రమాదం..రెండు గూడ్స్ రైళ్లు ఢీకొని భారీ అగ్నిప్రమాదం.. లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!

    Rail Accident: జార్ఖండ్‌లోఘోర రైలు ప్రమాదం..రెండు గూడ్స్ రైళ్లు ఢీకొని  భారీ అగ్నిప్రమాదం.. లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 01, 2025
    09:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.

    ఈ ఘటనలో మంటలు చెలరేగి రెండు ఇంజిన్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లోకో పైలెట్లతో పాటు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

    అదనంగా, ముగ్గురు సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తెల్లవారు జామున 3:30 గంటలకు జరిగినట్లు సమాచారం.

    ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెళ్తున్న గూడ్స్ రైలు, బర్హెట్ వద్ద ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు సమాచారం.

    ప్రమాదం వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో, వారు తీవ్ర కష్టంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

    అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    వివరాలు 

    ఒడిశాలో మరో రైలు ప్రమాదం

    ఇదే సమయంలో, ఆదివారం ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది.

    కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన కటక్‌లోని నెర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.

    బెంగళూరుకు చెందిన రైలు నంబర్ 12251, అసోంలోని కామాఖ్య స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

    ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా రాష్ట్రం కటక్ జిల్లాలో ఆదివారం ఈ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిందని ఓ అధికారి తెలిపారు.

    ఎస్‌ఎంవీటీ బెంగళూరు-కామాఖ్య ఏసీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 11 కోచ్‌లు, మంగూలి సమీపంలోని నెర్గుండిలో ఉదయం 11:54 గంటలకు పట్టాలు తప్పినట్లు అధికారికంగా ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జార్ఖండ్
    రైలు ప్రమాదం

    తాజా

    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు

    జార్ఖండ్

    New India-PM Modi-Pakistan: ఇది సరికొత్త భారత్...పాక్ పప్పులుడకట్లేదు: ప్రధాని నరేంద్రమోదీ నరేంద్ర మోదీ
    Jharkhand: జార్ఖండ్ మంత్రి సెక్రటరీ ఇంటిపై ఈడీ దాడులు.. రూ.20 కోట్లు స్వాధీనం   భారతదేశం
    Jharkhand : 34.23 కోట్ల నగదు రికవరీ .. జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి, సహాయకుడు అరెస్టు భారతదేశం
    Manipur Shooting: మణిపూర్‌లో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కూలీలు కాల్చివేత  మణిపూర్

    రైలు ప్రమాదం

    పాకిస్థాన్‌: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు; 22 మంది మృతి  పాకిస్థాన్
    Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు  బెంగళూరు
    మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి మిజోరం
    మధురై రైల్లో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి, మరింత పెరిగే అవకాశం తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025