NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PAC-SEBI: నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్‌పర్సన్ మాధబి..
    తదుపరి వార్తా కథనం
    PAC-SEBI: నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్‌పర్సన్ మాధబి..
    నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్‌పర్సన్ మాధబి..

    PAC-SEBI: నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్‌పర్సన్ మాధబి..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 24, 2024
    08:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ గురువారం రోజు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ముందు హాజరు కావాల్సి ఉంది.

    కమిటీ ఇప్పటికే మాధబికి సమన్లు జారీ చేయడంతో, సెబీ పనితీరును సమీక్షించడానికి పీఏసీ సిద్ధమైంది.

    కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. అయితే, ఈ చర్యలను భారతీయ జనతా పార్టీ తప్పుపట్టింది.

    బీజేపీ సీనియర్ నాయకులు, మాధబిని రాజకీయ ప్రేరేపణలతోనే పిలిచారని ఆరోపించారు.

    పార్లమెంట్ చట్టం ద్వారా నియంత్రణ సంస్థల పనితీరును సమీక్షించడానికి పార్లమెంట్ కమిటీకి అధికారాలు ఉంటాయి.

    ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ, సెబీ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉంటుంది.

    వివరాలు 

    మాధబి పూరీ బుచ్‌ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు

    ఇక, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన దర్యాప్తులో మాధబి లేదా ఆమె కుటుంబంపై ఎలాంటి అవకతవకలు లభించలేదని సమాచారం.

    మాధబి పూరీ బుచ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఉన్నత వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.

    సెబీ చీఫ్ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారన్న ఆరోపణలపై కూడా పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టింది.

    అయితే, మాధబి లేదా ఆమె కుటుంబ సభ్యులు తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తులో తేలింది.

    వివరాలు 

    ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు

    అదానీ గ్రూప్‌కు చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

    సెబీ చైర్‌పర్సన్ హోదాలో ఉన్న సమయంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనం పొందుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

    మాధబి తన కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీ ప్రైవేటు లిమిటెడ్‌కి సెబీతో సంబంధాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి.

    కానీ ఈ ఆరోపణలను మాధబి తోసిపుచ్చి, ఇవి తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన చర్యలేనని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025