NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhya Pradesh: భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీపై దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
    తదుపరి వార్తా కథనం
    Madhya Pradesh: భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీపై దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
    భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీపై దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ

    Madhya Pradesh: భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీపై దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 10, 2025
    10:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత క్రికెట్ జట్టు 12 సంవత్సరాల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

    దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి, ముచ్చటగా మూడోసారి 'చాంపియన్స్' గా నిలిచింది.

    ఈ ఘన విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సవాలు జరుపుకుంటోంది.

    ప్రజలు పటాకులు కాల్చుతూ, విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ సందర్భంగా కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి.

    మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా మోవ్ పట్టణంలో కొందరు యువకులు టీమ్‌ఇండియా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

    ఈ ర్యాలీ పట్టణంలోని జామా మసీద్ వద్దకు చేరుకున్న సమయంలో, కొందరు వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.

    వివరాలు 

    ఘటనపై దర్యాప్తు..బాధ్యులపై కఠిన చర్యలు

    పరస్పరం రాళ్లు విసురుకోవడంతో పాటు,కొన్ని దుకాణాలు ధ్వంసం చేశారు.వాహనాలకు నిప్పు పెట్టారు.

    పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి,ఇరువర్గాలను చెదరగొట్టారు.ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఇండోర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

    ఈ ఘర్షణల కారణంగా మోవ్ పట్టణంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయని ఇండోర్ రూరల్ ఎస్పీ హితికా వాసల్ పేర్కొన్నారు.

    టీమ్‌ఇండియా విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

    పటాకులు కాల్చడం వల్లే వివాదం మొదలైందని వివరించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసత్య వార్తలను నమ్మరాదని సూచించారు.

    పోలీసులు నిరంతర పహరా నిర్వహిస్తున్నారని,గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

    ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    ఈఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం.. ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: భారత్‌పై పాక్ డ్రోన్ల దాడి.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు  భారతదేశం
    Srinagar Airport: శ్రీనగర్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా డ్రోన్ దాడికి యత్నం.. అడ్డుకున్న భారత సైన్యం శ్రీనగర్

    మధ్యప్రదేశ్

    Ramniwas Rawat: కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన మాజీ మంత్రి రాంనివాస్ రావత్  భారతదేశం
    MadhyaPradesh : ఓటు వేసిన బీజేపీ నాయకుడి మైనర్ కుమారుడు.. పోలింగ్ టీం సస్పెండ్.. ఎఫ్ఐఆర్ నమోదు  భోపాల్
    Indore Road Accident: ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి  రోడ్డు ప్రమాదం
    Gwalior: గ్వాలియర్‌లో ర్యాగింగ్ కలకలం.. మండే ఎండలో గంటల తరబడి మోకాళ్లపై కూర్చోపెట్టి ..  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025