NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అర్ధరాత్రి షిండే, ఫడ్నవీస్‌ మంతనాలు.. అజిత్‌ వర్గం ప్రభుత్వంలో చేరికపై సమాలోచనలు
    తదుపరి వార్తా కథనం
    అర్ధరాత్రి షిండే, ఫడ్నవీస్‌ మంతనాలు.. అజిత్‌ వర్గం ప్రభుత్వంలో చేరికపై సమాలోచనలు
    అజిత్‌ వర్గం ప్రభుత్వంలో చేరికపై సమాలోచనలు

    అర్ధరాత్రి షిండే, ఫడ్నవీస్‌ మంతనాలు.. అజిత్‌ వర్గం ప్రభుత్వంలో చేరికపై సమాలోచనలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 07, 2023
    06:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర రాజకీయాలు గత కొద్ది రోజులుగా ఊహించని రీతిలో మలుపులు తీసుకుంటున్నాయి. పార్టీ నేతలు ఎప్పుడు ఏం చేయనున్నారో, ఎవరు ఏ పార్టీలోకి మారతారోనని మరాఠ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

    ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ గురువారం అర్ధరాత్రి సమావేశమయ్యారు.

    ఈ మేరకు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులపైనా అజిత్ పవార్ వర్గం ప్రభుత్వంలో చేరికపైనా 2 గంటల వరకు మంతనాలు జరిపారు.

    చీలిపోయిన ఎన్సీపీ వర్గంతో అధికారాన్ని పంచుకోవడం, కేబినెట్ విస్తరణపై షిండే, ఫడ్నవీస్‌ చాలా సేపు చర్చించినట్లు సమాచారం.

    అయితే అజిత్‌ పవర్‌ వర్గం ప్రభుత్వంలో చేరడంపై ఏక్‌నాథ్‌ షిండే వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

    details

    ఏక్‌నాథ్‌ షిండే సీఎం పదవి నుంచి తప్పుకోవట్లేదు : శివసేన

    ఈ క్రమంలోనే షిండే, ఫడ్నవీస్‌ అర్ధరాత్రి వేళ అత్యవసరంగా భేటీ అవడం కీలకంగా మారింది. ఇటీవలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటు జెండా ఎగరేశాడు.

    ఈ మేరకు అజిత్‌ తన వర్గంతో కలిసి ప్రభుత్వంలో చేరిపోయారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంగా నియమాకం అయ్యారు. దీంతో మహా ప్రభుత్వంలో ప్రస్తుతం ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉన్నారు.

    మరో వైపు తమ పార్టీలో విభేదాలు ఏమీ లేవని షిండే వర్గం అంటోంది. ఏక్‌నాథ్‌ షిండే సీఎం పదవి నుంచి తప్పుకోవట్లేదని ఆయన వర్గం స్పష్టం చేసింది.

    మహారాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ఆగస్ట్‌ 4 వరకు నిర్వహించనున్నారు.

    details

    బీఏసీలో పాల్గొన్న సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు

    శుక్రవారం జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

    సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, మరో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్, ఎన్సీపీ నేత ఛగన్ భుజబల్ బీఏసీ సమావేశానికి హాజరయ్యారు.

    ఈ నేపథ్యంలో అజిత్‌ సహా మరో 12 మంది తిరుగుబాటు నేతలను శరద్ పవార్ వర్గంలోని ఎన్సీపీ బహిష్కరించింది. ఈ మేరకు దిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో భాగంగా పార్టీ తీర్మానించిందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వెల్లడించారు.

    మరోవైపు ఈ సమావేశంలో చేసిన తీర్మానాలకు చట్ట బద్ధత లేదని అజిత్‌ పవార్‌ వర్గం అంటుండటం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏక్‌నాథ్ షిండే
    అజిత్ పవార్

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    ఏక్‌నాథ్ షిండే

    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ శివసేన
    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం శివసేన
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    అజిత్ పవార్

    మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా?  మహారాష్ట్ర
    బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు  మహారాష్ట్ర
    రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    ఎన్సీపీ గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025