NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NCP Crisis: మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు 
    తదుపరి వార్తా కథనం
    NCP Crisis: మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు 
    మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు

    NCP Crisis: మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు 

    వ్రాసిన వారు Stalin
    Jul 05, 2023
    06:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మామ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే, ఆయనే తమ ఆరాధ్య దైవం అని కొనియాడారు.

    బాంద్రా ఎంఈటీ సెంటర్‌లో జరిగిన సమావేశంలో అజిత్ పవార్ మాట్లాడారు. అందరి ముందు తనను విలన్‌గా చూపించావని శరద్ పవార్‌పై అజిత్ పవార్ మండిపడ్డారు. అయినా ఆయనపై ఇప్పటికీ తనకు చాలా గౌరవం ఉందన్నారు.

    ఐఏఎస్‌ అధికారులు 60 ఏళ్లకే రిటైర్ అవుతారని, రాజకీయాల్లో కూడా బీజేపీ నేతలు 75 ఏళ్లకే రిటైర్ అవుతున్నారని, అందుకు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలే ఉదాహరణ అని పేర్కొన్నారు. అది కొత్త తరం ఎదగడానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

    ఎన్సీపీ

    శరద్ పవార్ వల్లే సీఎం పీఠాన్ని వదులుకున్నాం: అజిత్

    'మీకు ఇప్పుడు 83 ఏళ్లు, ఇక మీరు విశ్రాంతి తీసుకోవాలి. మీ ఆశీర్వాదాలు మాకు అందించండి. మీరు దీర్ఘాయుష్షు పొందాలని మేము ప్రార్థిస్తున్నాము' అని బాంద్రాలో పార్టీ శాసనసభ్యులు, కార్యకర్తలను ఉద్దేశించి అజిత్ పవార్ మాట్లాడారు.

    2004లో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఎస్పీపీ కోల్పోవడానికి శరద్ పవార్ కారణమని అజిత్ పవార్ ఆరోపించారు.

    2017లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వర్షా బంగ్లాలో జరిగిన సమావేశాన్ని కూడా ఈ సందర్భంగా అజిత్ ప్రస్తావించారు.

    కేబినెట్ పోర్ట్‌ఫోలియో కేటాయింపు, మంత్రి పదవులపై బీజేపీ-ఎన్సీపీ మధ్య చర్చలు జరిగాయని, కానీ తర్వాత తమ పార్టీ వెనక్కి వేసిందని అజిత్ పవార్ పేర్కొన్నారు.

    ఎన్సీపీ

    జాతీయ ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిశాం: ప్రఫుల్ పటేల్ 

    ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరడంపై అజిత్ పవార్ వర్గం నాయకుడు ప్రఫుల్ పటేల్ స్పందించారు.

    భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. శివసేన సిద్ధాంతాన్ని అంగీకరించినప్పుడు, బీజేపీతో కలిసి వెళ్లడానికి ఇబ్బంది ఏంటని ప్రపుల్ పటేల్ అడిగారు.

    పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీతో కలిసి వెళ్లారని, ఇప్పుడు వారు ఉమ్మడి ప్రతిపక్షంలో భాగమయ్యారని ప్రఫుల్ పటేల్ అన్నారు.

    అయితే జాతీయ ప్రయోజనాల కోసమే తాము ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    శరద్ పవార్
    అజిత్ పవార్
    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    తాజా

    GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం ముంబయి ఇండియన్స్
    Telangana: పోచంపల్లి నుండి తాండూరు వరకు.. తెలంగాణ ఉత్పత్తులకు గౌరవ గుర్తింపు! తెలంగాణ
    Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్? కాంగ్రెస్
    Operation Sindoor: శత్రు గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్ శక్తిని చూపిన భారత్ : ప్రధాని మోదీ ఆపరేషన్‌ సిందూర్‌

    మహారాష్ట్ర

    కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌ ఆటో మొబైల్
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు దిల్లీ
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం కోవిడ్

    శరద్ పవార్

    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య మహారాష్ట్ర
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఎన్సీపీ కమిటీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    అజిత్ పవార్

    మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా?  మహారాష్ట్ర
    బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు  మహారాష్ట్ర
    రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    ఎన్సీపీ గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్ శరద్ పవార్

    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్  ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025