NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra: అమిత్ షాతో మహాయుతి నేతలు భేటీ; త్వరలో సీఎం ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    Maharashtra: అమిత్ షాతో మహాయుతి నేతలు భేటీ; త్వరలో సీఎం ప్రకటన
    అమిత్ షాతో మహాయుతి నేతలు భేటీ; త్వరలో సీఎం ప్రకటన

    Maharashtra: అమిత్ షాతో మహాయుతి నేతలు భేటీ; త్వరలో సీఎం ప్రకటన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 29, 2024
    11:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో (Maharashtra CM Post) కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా స్ఫష్టత రాలేదు.

    ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Ekanth Shinde) దీనిపై ఒకటి లేదా రెండు రోజుల్లో స్పష్టమైన నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.

    కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో (Amit Shah) జరిగిన సమావేశం అనంతరం శిందే ఢిల్లీకి వెళ్లి మీడియాతో మాట్లాడారు.

    వివరాలు 

     మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి సంచలన విజయం 

    ''మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ ఏర్పాటుపై మా మిత్రపక్షాలతో సానుకూల చర్చలు జరిగినవి. ముంబయిలో మరోసారి చర్చించిన అనంతరం నిర్ణయం ప్రకటిస్తాం. మిత్రపక్షాల మధ్య మంచి సమన్వయం ఉంది. ప్రజలు మాకు ఇచ్చిన స్పష్టమైన తీర్పును మేము గౌరవిస్తున్నాము. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మేం నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు తెలుసు'' అని శిందే పేర్కొన్నారు.

    ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి సంచలన విజయాన్ని సాధించింది.

    బీజేపీ 132 సీట్లను సాధించగా, శిందే శివసేనకు 57, అజిత్ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీకు 41 సీట్లు దక్కాయి. విపక్ష మహావికాస్ అఘాడీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

    వివరాలు 

    అమిత్ షాతో చర్చలు

    అయితే, మహాయుతి ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.

    శిందే, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis), అజిత్ పవార్‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు.

    మరోవైపు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం మహారాష్ట్రలోని సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఫడణవీస్‌ ప్రధానమైన అభ్యర్థిగా ఉండటం అయినా, బీజేపీ అధిష్టానం మరొక ఆలోచనకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

    వివరాలు 

    ఉప ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్ శిందే తిరస్కరించారు

    ఉప ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్ శిందే తిరస్కరించారని, ఆయన సన్నిహితుడు ఒకరు వెల్లడించారు.

    ''క్యాబినెట్‌లో భాగంగా ఉండాలని శిందే నిర్ణయించారు. కానీ, ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత ఉప ముఖ్యమంత్రిగా ఉండటం ఎలా స్మార్ట్ అవుతుందో అని శివసేన ఎమ్మెల్యే సంజయ్ సిర్సాత్ వ్యాఖ్యానించారు'' అని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    మహారాష్ట్ర

    Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధం..99 మంది అభ్యర్థుల తొలి లిస్ట్ రిలీజ్ భారతదేశం
    Maharashtra: బారామతి నుంచి అజిత్ పవార్ బరిలోకి.. ఎన్సీపీ ఫస్ట్ లిస్ట్ విడుదల ఎన్నికలు
    Mumbai: 9 ఏళ్ల బాలిక చెంపపై కొట్టిన ట్యూషన్ టీచర్.. టెటానస్ ఇన్ఫెక్షన్‌తో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని.. ముంబై
    Zeeshan Siddique: అజిత్ పవార్ ఎన్‌సిపిలో చేరిన బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025