NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mohamed Muizzu: తాజ్‌మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు
    తదుపరి వార్తా కథనం
    Mohamed Muizzu: తాజ్‌మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు
    తాజ్‌మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు

    Mohamed Muizzu: తాజ్‌మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 08, 2024
    01:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు.

    ఈ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన తాజ్ మహల్‌ను సందర్శించారు.

    ముయిజ్జు తన సతీమణి సాజిదా మొహమ్మద్‌తో కలిసి ఉదయం ఆగ్రా చేరుకుని తాజ్ మహల్ అందాలను ఆస్వాదించారు. వారు అక్కడ ఫొటోలు తీసుకున్నారు.

    అంతకుముందు, సోమవారం రోజున, ముయిజ్జు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

    ఈ సమావేశం తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు.

    వివరాలు 

     భారతీయులు మాల్దీవులకు వస్తారని ఆశిస్తున్నా: ముయిజ్జు

    తనకు ఆహ్వానం అందించినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ఘన స్వాగతం పలికినందుకు ప్రధాని మోదీకి, భారత ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    మాల్దీవుల టూరిజం విషయంలో భారతీయుల ప్రమేయం అధికంగా ఉందని, భవిష్యత్తులో మరింత మంది భారతీయులు మాల్దీవులకు వస్తారని ఆశిస్తున్నట్లు అన్నారు.

    ముయిజ్జు మాట్లాడుతూ, "మాల్దీవులకు ప్రతిసారీ అవసరం వచ్చినప్పుడు భారత్ స్నేహ హస్తం అందిస్తోంది. మాల్దీవుల ఆర్థికాభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది," అని అభిప్రాయపడ్డారు.

    ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత్-మాల్దీవుల సంబంధం వందల ఏళ్ల పురాతనమని చెప్పారు. అయితే, గతంలో ముయిజ్జు చేసిన వ్యాఖ్యలకు ఆయన తాజా వ్యాఖ్యలు భిన్నంగా ఉండటం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మొహమ్మద్ ముయిజ్జు
    తాజ్ మహల్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మొహమ్మద్ ముయిజ్జు

    India- Maldives: భారత టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి మాల్దీవులు

    తాజ్ మహల్

    Taj Mahal: భారీ వర్షాల కారణంగా తాజ్‌మహల్‌లో వాటర్ లీకేజీ!  ఆగ్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025