Page Loader
Kharge: రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ప్రకటనపై దుమారం.. సారీ చెప్పిన ఖర్గే.. ఎందుకంటే!
రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ప్రకటనపై దుమారం.. సారీ చెప్పిన ఖర్గే.. ఎందుకంటే!

Kharge: రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ప్రకటనపై దుమారం.. సారీ చెప్పిన ఖర్గే.. ఎందుకంటే!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2025
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజ్యసభలో విద్యాశాఖ పనితీరుపై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని అధికార పక్షం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే తాను క్షమాపణ చెబుతున్నానని ప్రకటించారు. తన మాటలు డిప్యూటీ ఛైర్మన్‌ను ఉద్దేశించినవి కావని, కేవలం ప్రభుత్వ విధానాలపై విమర్శించేందుకు మాత్రమే ఉపయోగించానని స్పష్టతనిచ్చారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల అనంతరం విద్యాశాఖ పనితీరుపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్‌కు చర్చ ప్రారంభించాల్సిందిగా సూచించారు.

వివరాలు 

కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది 

ఇదే సమయంలో, తమిళనాడు ప్రభుత్వంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని డీఎంకే ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల మధ్య చర్చలో జోక్యం చేసుకున్న ఖర్గే, ఉదయం తాను మాట్లాడినప్పుడు విద్యాశాఖ మంత్రి సభలో హాజరు లేకపోయారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా, ప్రభుత్వాన్ని విమర్శించేందుకు హిందీ భాషలో ఒక పదాన్ని ఉపయోగించగా, దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేత వాడిన భాష అసందర్భమని, ఖండించదగినదని అధికారపక్ష సభ్యులు మండిపడ్డారు.

వివరాలు 

క్షమాపణ కోరుతున్నాను: ఖర్గే 

సభలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఖర్గే వెంటనే స్పందించారు. తాను ఉపయోగించిన పదజాలం వల్ల ఎవరికైనా అసౌకర్యంగా అనిపిస్తే, దానికి తన మన్నించమని కోరుతున్నట్లు తెలిపారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం విధానాలపై మాత్రమేనని, ఛైర్‌ను ఉద్దేశించి చెప్పలేదని స్పష్టతనిచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే, దానికి ఖచ్చితంగా క్షమాపణ కోరుతున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు పేర్కొన్నారు.