
Amritsar: పంజాబ్ అమృత్సర్లో బాంబు పేలి.. దుండగుడు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో బాంబు పేలుడు ఒక కలకలాన్ని సృష్టించింది.
నగర బైపాస్ సమీపంలో ఓ అనుమానాస్పద వ్యక్తి బాంబు పెట్టేందుకు యత్నిస్తుండగా,అది అతని చేతిలోనే అకస్మాత్తుగా పేలి ప్రాణాలు కోల్పోయాడు.
గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించించారు.
ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబ్ స్క్వాడ్ను పిలిపించి దర్యాప్తు చేపట్టారు.
వివరాలు
నిర్మానుష్య ప్రాంతాల్లో బాంబు
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్సర్ గ్రామీణ జిల్లాలోని కాంబో పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి బైపాస్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో బాంబు అమర్చేందుకు యత్నించాడు. ఆ సమయంలో ఆ బాంబు అతడి చేతిలోనే అది పేలింది.
ఈ ఘటనలో దుండగుడు తీవ్రగాయాలపాలవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్
#WATCH | Amritsar, Punjab | Deputy Inspector General of Police (DIG) (Border Range) Satinder Singh says, "The person who was injured has died. He is a member of a terrorist organisation and he had come to retrieve the explosive consignment...We have received a lot of… https://t.co/TgA6FvetnF pic.twitter.com/bTsK6UGYNa
— ANI (@ANI) May 27, 2025