NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: గాడిద పాల పేరిట కుంభకోణం.. రూ.100 కోట్లు నష్టపోయిన బాధితులు
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: గాడిద పాల పేరిట కుంభకోణం.. రూ.100 కోట్లు నష్టపోయిన బాధితులు
    గాడిద పాల పేరిట కుంభకోణం

    Hyderabad: గాడిద పాల పేరిట కుంభకోణం.. రూ.100 కోట్లు నష్టపోయిన బాధితులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 15, 2024
    04:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల గాడిద పాల గురించి దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది.

    మార్కెట్లో ఉన్న హైప్‌, డిమాండ్‌ను ఉపయోగించి, తమిళనాడులోని ఓ ముఠా గాడిద పాల ఉత్పత్తి చేసే సంస్థ ఒక పెద్ద మోసాన్ని చేసింది.

    ఈ ఘటనలో తెలుగు రాష్ట్రాల్లో గాడిద పాల కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది.

    ఫ్రాంచైజీ మోడల్‌లో గాడిద పాలు తీసుకుని, ఓ సంస్థ దాదాపు రూ.100 కోట్ల మేరకు రైతులను మోసం చేసి పారిపోయిందని బాధితులు ఆరోపించారు.

    హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ వ్యవహారంపై బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

    వారు చెన్నైలోని "డాంకీ ప్యాలెస్" ఫ్రాంచైజీ గ్రూపు వారు నమ్మించి, వారిని మోసం చేశారని చెప్పారు.

    వివరాలు 

    గాడిదను రూ.80 వేల నుండి రూ.1.50 లక్షల వరకు అమ్మారు

    ''కొవిడ్‌ సమయంలో బహుళ పోషకాలు,రోగ నిరోధక శక్తి కలిగిన గాడిద పాలు చాలా డిమాండ్‌ ఉంటాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది.

    దీన్నిచూసి మేము ఈ సంస్థతో సంప్రదించాం. 'డాంకీ ప్యాలెస్' సంస్థ ఉలగనాథన్‌, అతని బృందం, గిరి సుందర్‌, బాలాజీ, సోనికరెడ్డి, డాక్టర్‌ రమేశ్‌ రైతుల వద్ద రూ.5 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకున్నారు.

    ఒక్కో పాడి గాడిదను రూ.80 వేల నుండి రూ.1.50 లక్షల వరకు అమ్మారు.అలాగే,గాడిదల నుంచి పాలు లీటరుకు రూ.1600 చొప్పున సేకరించేందుకు ఒప్పందం చేసుకున్నారు.

    3 నెలల పాటు నగదు చెల్లించారు, అయితే తర్వాత 18 నెలలుగా పాల సరఫరా, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఏమీ ఇవ్వలేదు.

    వివారాలు 

    చెన్నై పోలీసులకు ఫిర్యాదు

    ఈ వ్యవహారంపై ప్రశ్నించినప్పుడు, ఒక్కొక్కరికీ రూ.15 లక్షల నుంచి రూ.70లక్షల వరకు బ్యాంకు చెక్కులు రాసిచ్చారు.

    ఇచ్చిన బ్యాంకు చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. ఈ మోసంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 400 మందికి పైగా రైతులు దాదాపు రూ.100 కోట్ల మేర నష్టపోయారు.

    ఈ కుంభకోణం వెనుక రాజకీయ హస్తం ఉండవచ్చని బాధితులు చెబుతున్నారు.

    ఈ విషయంపై చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు.

    ఒప్పందం సమయంలో ఇచ్చిన జీఎస్‌టీ సంఖ్య, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కూడా నకిలీదని తేలింది.

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

    లేకపోతే, తీవ్ర పరిణామాలు చోటుచేసుకోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్
    తమిళనాడు
    కర్ణాటక

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    తెలంగాణ

    Telangana: సియోల్‌లో తెలంగాణ మంత్రుల పర్యటన.. నీటి వనరుల ప్రాజెక్టులపై దృష్టి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    Telangana: తెలంగాణలో ఎన్‌ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ.. ప్రభుత్వం అధికారిక ప్రకటన  ప్రభుత్వం
    Telangana Rains: తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి- మోస్తరు వర్షాలు.. ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు భారీ వర్షాలు
    Telangana Tourism:పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త.. సోమశిల-శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు.. లైఫ్-స్టైల్

    ఆంధ్రప్రదేశ్

    Nara Lokesh: సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులపై చర్చలు నారా లోకేశ్
    BR Naidu: గత ప్రభుత్వంలో తిరుమలలో అవకతవకలు.. తితిదే ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం
    Free Bus: మహిళలకు శుభవార్త.. సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు ప్రయాణం ఇండియా
    Chandrababu: 'ఉచిత గ్యాస్ సిలిండర్' పథకం ప్రారంభం..  టీ చేసిన సీఎం  చంద్రబాబు నాయుడు

    తమిళనాడు

    PM Modi: కన్యాకుమారిలో ధ్యానం చేయనున్న ప్రధాని.. షెడ్యూల్ ఏంటంటే..? నరేంద్ర మోదీ
    Annamalai: కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థి అన్నామలై వెనుకంజ  భారతదేశం
    Tamil Nadu: తమిళనాడులో కల్తీ మద్యం సేవించి 37 మంది మృతి భారతదేశం
    Tamilnadu: తమిళనాడుకు చెందిన 22 మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం  శ్రీలంక

    కర్ణాటక

    Karnataka: పుణె-బెంగళూరు హైవేపై బస్సు ట్రక్కు ఢీకొని 13 మంది మృతి రోడ్డు ప్రమాదం
    Karnataka: కర్ణాటకలో పానీపూరి ప్రియులకు షాక్.. పానీపూరీ శాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనం  భారతదేశం
    Karanataka: చిక్కబళ్లాపూర్ బీజేపీ ఎంపీ పార్టీలో మద్యం.. ట్విస్ట్ ఏంటంటే..?  భారతదేశం
    Ex-Karnataka minister: కాంగ్రెస్ మాజీ మంత్రి బి.నాగేంద్రకు 6 రోజుల ED రిమాండ్.. కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025