NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మహిళల ఊరేగింపుపై జాతీయ మహిళా కమిషన్ 3 సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు
    తదుపరి వార్తా కథనం
    మహిళల ఊరేగింపుపై జాతీయ మహిళా కమిషన్ 3 సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు
    మహిళల ఊరేగింపుపై జాతీయ మహిళా కమిషన్ 3సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు

    మహిళల ఊరేగింపుపై జాతీయ మహిళా కమిషన్ 3 సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 21, 2023
    06:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఇప్పటికే మూడు సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఛైర్‌ పర్సన్ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

    మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహావేశాలు పెల్లుబీకుతున్నాయి. ఈ నేపథ్యంలో రేఖా దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.

    జూన్‌ 12న కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తినా పట్టించుకోకపోవడంపై పాత్రికేయులు ప్రశ్నించారు.

    ఏలాంటి ఫిర్యాదు తనకు అందలేదన్న రేఖా, జులై 19న వీడియోలు వైరల్‌ కావడంతోనే సుమోటోగా స్వీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

    DETAILS

    మే 18, మే 29, జూన్‌ 19 తేదీల్లో లేఖలు రాసినా అధికారులు స్పందించలేదు : మహిళా కమిషన్

    నగ్నంగా ఊరేగించిన అకృత్యాలపై తనకు గతంలో ఫిర్యాదులు అందినట్లు కమిషన్ ఛైర్మన్ ఆంగీకరించారు.

    వీటిపై చర్యలు తీసుకోవాలని మే 18, మే 29, జూన్‌ 19 తేదీల్లో మొత్తం మూడు సార్లు మణిపూర్ అధికారులకు రాసిన లేఖలను రేఖాశర్మ బహిర్గతం చేశారు.

    తొలుత మహిళలపై హింస జరిగినట్లు మణిపూర్ సహా ఇతర రాష్ట్రాల నుంచీ లేఖలు వచ్చాయన్నారు. పలు లేఖలు విదేశాల నుంచి వచ్చాయన్నారు. ఈ మేరకు అన్ని లేఖలను ప్రామాణికత పరిశీలించకుండా స్వీకరించలేమన్నారు.

    ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ రాష్ట్ర పోలీసులు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం సదరు నిందితులకు మరణశిక్ష విధించేందుకు వెనకాడేది లేదని ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ఇటీవలే స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    మహిళ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    మణిపూర్

    మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు ఇంఫాల్
    మణిపూర్‌లో 40మంది మిలిటెంట్లు హతం: సీఎం బీరెన్ సింగ్  నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్
    అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం అస్సాం/అసోం
    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్ అమిత్ షా

    మహిళ

    ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే సలహాలు, వాటి వెనక ఉండే నిజాలు ప్రెగ్నెన్సీ
    బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం బడ్జెట్ 2023
    ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు తమిళనాడు
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025