NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు

    AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    08:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ప్రముఖ నేతలు మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్‌లపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.

    తాజాగా, ఈ కేసులో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) వీరిద్దరికి సమన్లు జారీ చేసింది.

    ఇందులో పేర్కొన్న ప్రకారం, సత్యేందర్ జైన్ ఈ నెల 6న, మనీశ్ సిసోదియా 9న ఢిల్లీలోని బ్యూరో కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది.

    వివరాలు 

    దాదాపు రూ.2,000 కోట్ల అవకతవకలు

    అధికారులు అందించిన సమాచారం ప్రకారం, ఆప్ పార్టీ పాలనలో ఉన్న సమయంలో మనీశ్ సిసోదియా విద్యాశాఖ మంత్రిగా, సత్యేందర్ జైన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

    వారి నేతృత్వంలో ఢిల్లీలో మొత్తం 12,748 పాఠశాల భవనాలు,తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించారు.

    అయితే, ఈ నిర్మాణాలలో దాదాపు రూ.2,000 కోట్ల అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

    ఈ ప్రాజెక్టులకు 34 మంది కాంట్రాక్టర్లు నియమించబడ్డారు. వారిలో చాలా మంది వ్యక్తులకు ఆప్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలుస్తోంది.

    వివరాలు 

    ప్రాజెక్టు ఖర్చు అదనంగా రూ.326 కోట్లు పెరిగింది 

    ఇంత పెద్ద ప్రాజెక్టు అయినప్పటికీ, నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తికాలేదు.పైగా, అప్పటికే భారీ ఖర్చులు చేశారు.

    తరగతి గదుల నిర్మాణం 30 ఏళ్ళ పాటు నిలబెట్టేలా ఉండేలా డిజైన్ చేసినప్పటికీ, వాటికి అయిన ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంది.

    ఇంకా, నియమాల ప్రకారం టెండర్ ప్రక్రియ నిర్వహించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్లను నేరుగా నియమించడంతో ప్రాజెక్ట్ వ్యయం దాదాపు ఐదు రెట్లు పెరిగిపోయింది.

    తాజాగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) విడుదల చేసిన నివేదికలో కూడా ఈ తరగతి గదుల నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా పేర్కొంది.

    కొత్త టెండర్లను పిలవకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు ఖర్చు అదనంగా రూ.326 కోట్లు పెరిగిందని అదే నివేదికలో వివరించారు.

    వివరాలు 

    ఏప్రిల్‌లో వీరిద్దరిపై అధికారికంగా కేసులు నమోదు

    నివేదిక ఆధారంగా సిసోదియా, జైన్‌లపై విచారణ జరిపేందుకు ఈ సంవత్సరం మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ అనుమతిని ఇచ్చారు.

    దాంతో ఏప్రిల్‌లో వీరిద్దరిపై అధికారికంగా కేసులు నమోదు అయ్యాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మనీష్ సిసోడియా

    తాజా

    AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు మనీష్ సిసోడియా
    Elon Musk: 'నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను'..ట్యాక్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ గళం ఎలాన్ మస్క్
    Trump Traiffs:నేటి నుంచి స్టీల్,అల్యూమినియం దిగుమతులపై సుంకాలు 50%కి పెంపు .. ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం   డొనాల్డ్ ట్రంప్
    G7 Summit: కెనడాలో జరిగే G7 నుంచి భారత్‌కు రాని ఆహ్వానం.. కాంగ్రెస్‌ విమర్శలు నరేంద్ర మోదీ

    మనీష్ సిసోడియా

    మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ దిల్లీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025