Bihar: పాట్నాలో భారీ అగ్నిప్రమాదం.. 6 గురుమృతి, 18 మందికి గాయాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 25, 2024
04:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్లోని పాట్నా రైల్వే జంక్షన్ సమీపంలోని ఒక హోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో 6 మంది మరణించగా, 18 మంది గాయపడ్డారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఐసియులో చేర్చారు. ' సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి