NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  16 మంది  మృతి 
    తదుపరి వార్తా కథనం
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  16 మంది  మృతి 
    చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  16 మంది  మృతి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 18, 2025
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌ నగరంలోని చార్మినార్‌ పరిధిలోని గుల్జార్‌ హౌస్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

    ఒక భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి భారీ ప్రమాదానికి దారి తీశాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు.

    అలాగే మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

    భవనంలో చిక్కుకున్న ఇతరులను రక్షించే చర్యలు కూడా తీసుకుంటున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో, అపోలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

    ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.

    Details

    దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

    ఈ ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందిన విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    ఈ ప్రమాద స్థలాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యక్షంగా పరిశీలించి, పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. జరిగిన పరిణామాలను తెలుసుకున్నారు.

    Details

    సహాయక చర్యల్లో ఆలస్యం : కిషన్ రెడ్డి

    కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి కూడా సంఘటనాస్థలాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

    ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు చెప్పారు.

    ఈ ప్రమాదంలో సహాయక చర్యల్లో ఆలస్యం జరిగిందన్న ఆరోపణలు బాధితుల నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు.

    పెద్ద ప్రమాదం కాకపోయినా, ప్రాణ నష్టం అధికంగా నమోదైందని అభిప్రాయపడ్డారు.

    అగ్నిమాపక సిబ్బందికి తగిన శిక్షణ, పరికరాలు అందించాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

    భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చార్మినార్
    అగ్నిప్రమాదం
    హైదరాబాద్

    తాజా

    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  16 మంది  మృతి  చార్మినార్

    చార్మినార్

    Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్

    అగ్నిప్రమాదం

    Mumbai timber market: ముంబై కలప మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి  ముంబై
    భవనంలో అగ్ని ప్రమాదం.. 9 నెలల చిన్నారి సహా నలుగురు మృతి  దిల్లీ
    Chile Wildfires: చిలీ అడవుల్లో కాల్చిచ్చు.. 46 మంది మృతి చిలీ
    Hyderabad: అనాజ్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం  హైదరాబాద్

    హైదరాబాద్

    MLC Election: హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల  ఎన్నికల సంఘం
    Hyderabad: అగ్ని ప్రమాదాలు,వరద ముంపు నివారణపై.. జీహెచ్‌ఎంసీ, హైడ్రా ప్రత్యేక దృష్టి భారతదేశం
    Betting Gang : ఫేక్ కంపెనీల పేరిట బెట్టింగ్ ముఠా.. హైదరాబాద్‌లో భార్యభర్తల అరెస్టు క్రికెట్
    Hyderabad: హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన తేమ శాతం.. రాష్ట్రవ్యాప్తంగా నేడు అధిక ఉష్ణోగ్రతలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025