NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్ 
    తదుపరి వార్తా కథనం
    Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్ 
    Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్

    Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్ 

    వ్రాసిన వారు Stalin
    Feb 21, 2024
    10:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర వైభవంగా జరగనుంది.

    రోజుకో ఘట్టంతో నాలుగు రోజుల పాటు తాడ్వాయి అడవి సమ్మక్క-సారలమ్మ స్మరణలతో మార్మోగనుంది.

    ప్రపంచంలోనే అరుదైన గిరిజన జాతరగా దీనికి పేరుంది. ఒక గిరిజన జాతరకు కోట్లలో భక్తులు రావడం మేడారంలోనే జరుగుతుంది.

    మేడారం జాతరకు తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.

    కాలినడకన, ఎడ్లబండ్లతో పాటు హెలికాప్టర్ లోనూ ఈ గిరిజన జాతరకు వస్తున్నారంటే సమ్మక్క, సారలమ్మ విశిష్టత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.

    మేడారం

    నాలుగు రోజు కీలక ఘట్టాలు ఇవే..

    అశేష భక్త జనవాహిని సందోహంలో సారలమ్మ బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుంచి గద్దెకు చేరుకోవడంతో జాతర లాంచనంగా ప్రారంభం అవుతుంది.

    సమ్మక్కతో పాటు పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజులు కూడా గద్దెలపైకి చేరుకుంటారు.

    ఇక రెండో రోజైన గురువారం చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను సర్కారు లాంఛనాలతో భక్తుల జయజయ ధ్వానాల మధ్య గద్దెపైకి తీసుకొస్తారు.

    సమ్మక్క రాకతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. మూడో రోజై శుక్రవారం సారలమ్మ, సమ్మక్కలు గద్దెపైకి భక్తులకు దర్శనమిస్తారు.

    అమ్మవార్లు చూసేందుకు భక్తజనం పోటెత్తుతారు. నాలుగో రోజై శనివారం సారలమ్మ, సమ్మక్కలు గద్దెల నుంచి తిరుగుపయనం అవుతారు. దీంతో జాతరం ముగుస్తుంది.

    మేడారం

    మోదీ ట్వీట్.. 23న రాష్ట్రపతి రాక

    మేడారం జాతర బుధవారం ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు చెప్పారు.

    ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో మేడారం జాతర ఒకటి అని మోదీ అన్నారు.

    భక్తి, సంప్రదాయాల కలయిక అయిన సమ్మక్క-సారక్కకు ప్రణమిల్లుదామని మోదీ పిలుపునిచ్చారు.

    సమ్మక్క-సారక్కల ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందామని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

    ఇదిలా ఉంటే, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఈనెల 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడారం రానున్నారు.

    అదే రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు, మంత్రులు కూడా సమ్మక్క, సారక్కలను దర్శించుకోనున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని మోదీ ట్వీట్

    గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు…

    — Narendra Modi (@narendramodi) February 21, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    తాజా వార్తలు
    తెలంగాణ

    తాజా

    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్

    నరేంద్ర మోదీ

    Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా? అయోధ్య
    Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు? అయోధ్య
    PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం  ఆంధ్రప్రదేశ్
    Narendra Modi: ఆంధ్రాలో చారిత్రక రామాయణ క్షేత్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ  భారతదేశం

    తాజా వార్తలు

    Ind vs Eng test 2024: యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ  యశస్వీ జైస్వాల్
    Geetha Madhuri: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి  గీతా మధూరి
    దేశంలోనే పాపులర్ సీఎంల జాబితాలో రెండోస్థానంలో 'యోగి'.. నంబర్ వన్ ఎవరో తెలుసా?  నవీన్ పట్నాయక్
    PM Modi: రాబోయే 100రోజులు చాలా కీలకం, అందరి విశ్వాసాన్ని చూరగొనాలి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    తెలంగాణ

    Jogulamba Gadwal district: ప్రైవేట్ బస్సులో చెరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం  జోగులాంబ
    Sankranthi Muggu: సంక్రాంతి ముగ్గుల వెనుక ఉన్న పురాణ చరిత్ర ఇదే  సంక్రాంతి
    Sankranthi dishes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే  సంక్రాంతి
    Damodara Rajanarsimha:మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ హ్యాక్  ఫేస్ బుక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025