NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మెగా డిఎస్సీకి ముహూర్తం ఖరారు..?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మెగా డిఎస్సీకి ముహూర్తం ఖరారు..?
    ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మెగా డిఎస్సీకి ముహూర్తం ఖరారు..?

    Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మెగా డిఎస్సీకి ముహూర్తం ఖరారు..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2025
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల గురించి ముఖ్యమైన ప్రకటన వెలువడింది.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

    ఇటీవల రాష్ట్ర సచివాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    నిజానికి, గతంలోనే డీఎస్సీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం యోచించినా, కొన్ని న్యాయపరమైన కారణాల వల్ల ఆలస్యం జరిగింది.

    వివరాలు 

    మార్చిలో నోటిఫికేషన్‌ను విడుదల

    అయితే, ఈసారి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది.

    మార్చిలో నోటిఫికేషన్‌ను విడుదల చేసి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నియామక ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై గత సంవత్సరం నుంచే చర్చలు సాగుతున్నాయి.

    ముఖ్యంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది.

    విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఉపాధ్యాయ నియామకాలను ప్రాధాన్యతగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

    ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

    వివరాలు 

    మత్స్యకార భరోసా పథకంపై చర్యలు

    అంతేకాదు, కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

    తల్లికి వందనం పథకాన్ని వేగంగా అమలు చేయడంతో పాటు, మత్స్యకార భరోసా పథకంపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు.

    ఇప్పటికే డీఎస్సీ సిలబస్‌ను విడుదల చేసిన ప్రభుత్వం, నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సంకల్పించింది.

    దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఆశాజనకమైన పరిణామంగా కనిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌
    COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి  పశ్చిమ బెంగాల్

    ఆంధ్రప్రదేశ్

    CM Chandrababu: బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన.. ఎంపీలంతా ఈ దిశగా కృషి చేయాలి  భారతదేశం
    Nara Lokesh: ప్రతి శనివారం 'నో బ్యాగ్‌ డే'.. విద్యార్థుల కోసం కొత్త కార్యక్రమం నారా లోకేశ్
    Andhrapadesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త స్టేడియం నిర్మాణం.. మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ప్రకటన భారతదేశం
    MLC Elections: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025