NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MEIL: తెలంగాణలో మెఘా ఇంజనీరింగ్ కంపెనీతో మూడు కీలక ఒప్పందాలు.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    MEIL: తెలంగాణలో మెఘా ఇంజనీరింగ్ కంపెనీతో మూడు కీలక ఒప్పందాలు.. 
    తెలంగాణలో మెఘా ఇంజనీరింగ్ కంపెనీతో మూడు కీలక ఒప్పందాలు..

    MEIL: తెలంగాణలో మెఘా ఇంజనీరింగ్ కంపెనీతో మూడు కీలక ఒప్పందాలు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    08:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మెఘా ఇంజనీరింగ్ (MEIL) సంస్థతో మూడు ప్రధాన ఒప్పందాలను కుదుర్చుకుంది.

    ఈ ఒప్పందాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, అధిక ఉద్యోగ అవకాశాలు, అలాగే సుస్థిర ఇంధన పరిశ్రమలకు పునాదులను వేస్తాయి.

    ఈ ఒప్పందాలు రాష్ట్రంలోని పర్యాటక రంగం, ఇంధన రంగం, ఉపాధి అవకాశాలను మరింత అభివృద్ధి చేయడంలో సహాయపడతాయని పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ప్రాజెక్ట్ 

    తెలంగాణ రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి మెఘా ఇంజనీరింగ్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.

    ఈ ప్రాజెక్టుకు దాదాపు ₹11,000 కోట్ల పెట్టుబడులు పొందడం జరుగుతుంది.

    నిర్మాణ దశలో 1,000 మందికి ఉపాధి కల్పించబడుతుంది, ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత 250 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

    ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2025 క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలు సాధించబడతాయి.

    వివరాలు 

    బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ 

    మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఆధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

    రాష్ట్రవ్యాప్తంగా 100 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలను నెలకొల్పడం కోసం రూ. 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

    ఈ ప్రాజెక్టు ద్వారా రెండు సంవత్సరాల లోపు 1,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, 3,000 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది.

    ఇది ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది.

    వివరాలు 

    ప్రపంచ స్థాయి లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ 

    పర్యాటక రంగంలో మెఘా ఇంజనీరింగ్ మరో కీలక పెట్టుబడి చేస్తోంది.

    అనంతగిరిలో ప్రపంచ స్థాయి లగ్జరీ వెల్నెస్ రిసార్ట్‌ను నిర్మించేందుకు ఈ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

    ఈ ప్రాజెక్టు కోసం ₹1,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. నిర్మాణ దశలో 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దుద్దిళ్ల శ్రీధర్ బాబు

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    దుద్దిళ్ల శ్రీధర్ బాబు

    Telangana: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   ఆర్ బి ఐ
    Medigadda visit: 29న ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన  మేడిగడ్డ బ్యారేజీ
    Sridhar Babu: తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారుస్తాం: దుద్దిళ్ల శ్రీధర్ బాబు   భారతదేశం
    Allegro Micro Systems: తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న అలెగ్రో మైక్రో సిస్టమ్స్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025